మాజీ ప్రధాని బర్త్‌డే... 93 మంది ఖైదీలు విడుదల

- December 25, 2017 , by Maagulf
మాజీ ప్రధాని బర్త్‌డే... 93 మంది ఖైదీలు విడుదల

భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి జన్మదిన వేడుకలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని వాజ్ పేయి నివాసం వద్ద ఆయనకు బర్త్ డే విషెస్ చెబుతూ భారీగా బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాజ్ పేయి జన్మదినం సందర్భంగా యూపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సత్ ప్రవర్తన కలిగిన 93 మంది ఖైదీలను విడుదల చేయనుంది.

ఢిల్లీలోని వాజ్ పేయి నివాసం సందడిగా మారింది. ప్రధాని మోడీ సహా పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ ముఖ్య నేతలు ఆయన నివాసనికి వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. వాజ్ పేయి కుటుంబసభ్యుల యోగక్షేమాలు తెలుసుకున్నారు. పలు ప్రాంతాల్లో బీజేపీ, ఆరెస్సెస్ కార్యకర్తలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దేశానికి వాజ్ పేయి చేసిన సేవలను కొనియాడారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com