పోలాండ్-ఈజిప్టు విమానానికి బాంబు బెదిరింపు
- November 19, 2015
బాంబు బెదిరింపుతో పోలాండ్-ఈజిప్టు విమానం అత్యవసరంగా కిందకు దిగింది. బల్గేరియా రాజధాని సోఫియాలో ల్యాండ్ అయింది. విమానంలో బాంబు పెట్టినట్టు 64 ఏళ్ల ప్రయాణికుడు సమాచారం అందించాడని, అతడిని భద్రతా అధికారులు ప్రశ్నిస్తున్నారని బల్గేరియా మీడియా తెలిపినట్టు జిన్హువా వార్తా సంస్థ వెల్లడించింది. విమానం నుంచి ప్రయాణికులను దించేసి, సోదాలు చేపట్టారు. వార్సా నుంచి ఈజిప్టులోని రిస్టార్ట్ నగరం హర్గదాకు విమానం వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గత నెల 31న ఈజిప్టులోని సినాయ్ ద్వీపకల్పంలో కూలిన రష్యా విమానాన్ని ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు బాంబుతో పేల్చేశారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలాండ్-ఈజిప్టు విమానానికి బాంబు బెదిరింపు రావడంతో భయాందోళన వ్యక్తమవుతోంది.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









