ఖతర్కు మరిన్ని టర్కీ బలగాలు
- December 28, 2017టర్కీ, ఖతర్ల మధ్య కుదిరిన సంయుక్త రక్షణ ఒప్పందంలో భాగంగా ఖతర్లోని సైనిక స్థావరానికి టర్కీ మరింతమంది సైనిక బలగాలను పంపింది. దోహాలోని అల్ ఉబెద్ వైమానిక స్థావరానికి తాజాగా బలగాలు చేరుకున్నట్లు కతార్ రక్షణ మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది. సంయుక్త సైనిక సామర్ధ్యాలను పెంపొందించుకునేందుకు కొత్తగా వచ్చిన సైనిక బృందం ఖతర్ సాయుధ బలగాలకు శిక్షణ ఇస్తుం ది. 2014లో కుదిరిన ఒప్పందంలో భాగంగా మధ్య ప్రాచ్యంలో తొలిసారిగా ఖతర్లో సైనిక శిబిరాన్ని టర్కీ నెలకొల్పింది. ఈ స్థావరంలో 5వేల మంది సైనికులకు వసతి కల్పించే సదుపాయం వుంది. కాగా, ఖతర్లో తన సైనిక బలగాలను నెమ్మదిగా 3వేలకు పెంచాలని టర్కీ యోచిస్తోంది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు