ఖతర్కు మరిన్ని టర్కీ బలగాలు
- December 28, 2017
టర్కీ, ఖతర్ల మధ్య కుదిరిన సంయుక్త రక్షణ ఒప్పందంలో భాగంగా ఖతర్లోని సైనిక స్థావరానికి టర్కీ మరింతమంది సైనిక బలగాలను పంపింది. దోహాలోని అల్ ఉబెద్ వైమానిక స్థావరానికి తాజాగా బలగాలు చేరుకున్నట్లు కతార్ రక్షణ మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది. సంయుక్త సైనిక సామర్ధ్యాలను పెంపొందించుకునేందుకు కొత్తగా వచ్చిన సైనిక బృందం ఖతర్ సాయుధ బలగాలకు శిక్షణ ఇస్తుం ది. 2014లో కుదిరిన ఒప్పందంలో భాగంగా మధ్య ప్రాచ్యంలో తొలిసారిగా ఖతర్లో సైనిక శిబిరాన్ని టర్కీ నెలకొల్పింది. ఈ స్థావరంలో 5వేల మంది సైనికులకు వసతి కల్పించే సదుపాయం వుంది. కాగా, ఖతర్లో తన సైనిక బలగాలను నెమ్మదిగా 3వేలకు పెంచాలని టర్కీ యోచిస్తోంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







