ఖతర్కు మరిన్ని టర్కీ బలగాలు
- December 28, 2017
టర్కీ, ఖతర్ల మధ్య కుదిరిన సంయుక్త రక్షణ ఒప్పందంలో భాగంగా ఖతర్లోని సైనిక స్థావరానికి టర్కీ మరింతమంది సైనిక బలగాలను పంపింది. దోహాలోని అల్ ఉబెద్ వైమానిక స్థావరానికి తాజాగా బలగాలు చేరుకున్నట్లు కతార్ రక్షణ మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది. సంయుక్త సైనిక సామర్ధ్యాలను పెంపొందించుకునేందుకు కొత్తగా వచ్చిన సైనిక బృందం ఖతర్ సాయుధ బలగాలకు శిక్షణ ఇస్తుం ది. 2014లో కుదిరిన ఒప్పందంలో భాగంగా మధ్య ప్రాచ్యంలో తొలిసారిగా ఖతర్లో సైనిక శిబిరాన్ని టర్కీ నెలకొల్పింది. ఈ స్థావరంలో 5వేల మంది సైనికులకు వసతి కల్పించే సదుపాయం వుంది. కాగా, ఖతర్లో తన సైనిక బలగాలను నెమ్మదిగా 3వేలకు పెంచాలని టర్కీ యోచిస్తోంది.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







