భార్యను గొంతు నులిమి చంపిన నిందితుడు పోలీసుల ఎదుట లొంగుబాటు
- December 29, 2017కువైట్ : ఇటీవల సంచలనం కల్గించిన జహ్రా లోని తైమ ప్రాంతంలో 22 ఏళ్ల మహిళ హత్య కేసులో అనుమానితుడు హతురాలి భర్తను పోలీసులు అదుపులో తీసుకొన్నారు. తన భార్య తో కొన్ని సమస్యలు కలిగిఉన్నట్లు ఆ గొడవలు ఒక ప్రతిష్టంభన దశకు చేరుకున్నాయని ఆ నేపథ్యంలో ఆమెని తానె స్వయంగా అంతమొందించినట్లు ఒప్పుకున్నాడు. అనుమానితుడు తన భార్యను జహ్రా క్లబ్ పార్కింగ్ స్థలంలోకి తీసుకువెళ్ళి శాంతియుతంగా సమస్య పరిష్కరించుకొందామని యత్నించానని అయితే మా ఇరువురి మధ్య వాగ్యువాదం తీవ్ర స్థాయికి చేసారుకోవడంతో పట్టరాని కోపంతో తన భార్య గొంతు నులిమి చంపినట్లు డిటెక్టివ్లకు నిందితుడు చెప్పాడు. తన తండ్రి అంతర్గత వ్యవహారాల శాఖలో పనిచేస్తున్నాడని తన భార్యతో ఏర్పడిన తగాదా గురించి చెప్పి మీ కోడలను చంపివేసినట్లు తన తండ్రికి చెప్పడం జరిగిందని..ఆయన సూచనతో తైమా పోలీసు స్టేషన్ వద్ద పోలీసులకు లొంగిపోయినట్లు నిందితుడు తెలిపాడు.
తాజా వార్తలు
- T20 ప్రపంచకప్...బ్రాండ్ అంబాసిడర్గా బోల్ట్
- తెలంగాణ రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి
- ఇళ్ల మరమ్మతులకు Dh2 బిలియన్ ఫండ్
- ఈజిప్షియన్లకు వర్క్ పర్మిట్ జారీ నిలిపివేత..!
- విదేశీ కార్మికుల కోసం బహ్రెయిన్లో కొత్త చట్టం..!
- హాస్పిటల్లో చేరిన కింగ్ సల్మాన్..!
- ఒమన్ లో 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' ప్రారంభం
- ఏప్రిల్ 16న విధించిన ట్రాఫిక్ జరిమానాలు రద్దు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..