బెంగుళూరు పబ్‌లో మంటలు.. ఐదుగురు మృతి

- January 07, 2018 , by Maagulf
బెంగుళూరు పబ్‌లో మంటలు.. ఐదుగురు మృతి

బెంగుళూరు : సోమవారం తెల్లవారు జామున అకస్మాత్తుగా కలాసిపల్యా మార్కెట్‌లోని కుంబార సంఘ్‌ భవనంలో గల కైలాష్‌ బార్‌లో మంటలు చెలరేగడంతో ఆ భవనంలోనే నిద్రిస్తున్న ఐదుగురు మృతిచెందారు. తుమ్‌కూర్‌కు చెందిన స్వామి, ప్రసాద్‌, మహేష్‌, హసాన్‌కు చెందిన మంజునాథ్‌, మండ్యాకు చెందిన కీర్తి మృతిచెందిన వారుగా పోలీసులు గుర్తించారు. వీరందరూ దట్టమైన పొగకారణంగా ఊపిరాడక మృతిచెందినట్లు అధికారుల తెలిపారు. రెండు అగ్నిమాపక యంత్రాల సహాయంతో మంటలను అదపులోకి తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com