సల్మాన్ను చంపేందుకు కుట్ర.!
- January 12, 2018
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ను చంపడానికి కొందరు దుండగులు ఆయన సినిమా 'రేస్ 3' సెట్ పరిసరాల్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పోలీసులు బాంద్రాలోని ఆయన ఇంటికి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. 'సల్మాన్, ఆయన కుటుంబ సభ్యులకు హానితలపెడుతామని బెదిరింపులకు పాల్పడటం ఇది తొలిసారి కాదు. అయినా సల్మాన్ బాడీగార్డులు లేకుండా బయటికి వస్తున్నారు.. ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆయనకు మరింత భద్రత అవసరం' అని సీనియర్ ఇన్స్పెక్టర్ అన్నారు. మరోపక్క నిర్మాత రమేశ్ 'రేస్ 3' సినిమా సెట్కు భద్రత పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నారట.
గురువారం పోలీసులు ముంబయి ఫిల్మ్సిటీలో 'రేస్ 3' సినిమా సెట్కు వెళ్లారు. షూటింగ్ ఆపాలని, వీలైనంత తొందరగా సల్మాన్ను తన ఇంటికి పంపించాలని నిర్మాత రమేశ్ తౌరాని కోరారు. అనంతరం స ల్మాన్ ఆరుగురు పోలీసులతో కలిసి వేరే కారులో ఇంటికి బయలుదేరారు. ఆయన సొంత కారులో మరికొందరు పోలీసులు ఇంటికి చేరుకున్నారు.
సల్మాన్ కొన్నేళ్ల క్రితం ఓ సినిమా షూటింగ్ కోసం జోధ్పూర్కు వెళ్లారు . ఈ క్రమంలో అక్కడ జింకను చంపాడన్న కారణంగా ఆయనపై కేసు నమోదైంది. ప్రస్తుతం తుది విచారణ జరుగుతోంది. విచారణలో భాగంగా ఇటీవల సల్మాన్ జోధ్పూర్ కోర్టుకు వెళ్లారు.
మరోకేసులో గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ను పోలీసులు అదే సమయంలో భద్రత మధ్య కోర్టుకు తీసుకొచ్చారు. ఈ సమయంలో లారెన్స్.. సల్మాన్ను చంపుతామని, ఆయనకు తమ పవర్ తెలియాలని బెదిరించాడు.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









