యూఏఈలో ఖతారీ షేక్ నిర్బంధం
- January 16, 2018దోహా: ఖతార్ రాయల్ ఫ్యామిలీకి చెందిన సభ్యుడొకరు, తాను యూఏఈలో నిర్బంధానికి గురైనట్లు ఆరోపిస్తున్నారు. వివాదాస్పదుడిగా ఈ ఖతారీ షేక్పై ఆరోపణలున్నాయి. షేక్ అబ్దుల్లా బిన్ అలి అల్ థని, దోహాతో అబుదాబీ - రియాద్ సంబంధాలు తెంచుకున్నాక మీడియేటర్గా తెరపైకొచ్చారు. ఖతార్కి చెందిన అల్ జజీరా టెలివిజన్ ప్రసారం చేసిన వీడియోలో, షేక్ ఓ కుర్చీలో కూర్చుని ఉన్నట్లుగా తెలియజేస్తోంది. అబుదాబీలో ఉన్న తనకు ఏమైనా జరిగితే ఖతార్కి చెడ్డ పేరు వస్తుందనీ, తాను యూఏఈ క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్కి అతిథినని చెబుతున్నట్లుగా వీడియోలో ఉంది. ఖతార్ ప్రజలు అమాయకులని అందులో షేక్ పేర్కొన్నారు. తనకు ఏం జరిగినా దానికి షేక్ మొహ్మద్ బాధ్యత తీసుకోవాలని పేర్కొన్నారు షేక్ అబ్దుల్లా.
తాజా వార్తలు
- ఓటింగ్ సరళి విపరీతంగా పెరిగే అవకాశం!
- తిరిగి విధుల్లో చేరిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ క్యాబిన్ సిబ్బంది!
- తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన..
- లోక్సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: డీజీపీ రవిగుప్తా
- అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు, ఫీజు, ప్రక్రియ
- దుబాయ్లో పెట్టుబడి ద్వారా ఉద్యోగి గోల్డెన్ వీసాకు మారవచ్చా?
- బహ్రెయిన్ చేరుకున్న అరబ్ లీగ్ చీఫ్
- మోసపూరిత ప్రకటనల పై సౌదీ హెచ్చరిక
- కువైట్ అమీర్ కు వ్యతిరేకంగా పోస్టులు..పలువురికి నోటీసులు
- 250 మంది ప్రవాసులకు ఒమానీ పౌరసత్వం