తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త

- January 18, 2018 , by Maagulf
తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త

నిరుద్యోగులకు శుభవార్త త్వరలో తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 18 వేల పోలీసు సిబ్బంది పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ వెలువడుతుందని. రాష్ట్ర డీజీపీ ఎం మహేందర్ రెడ్డి తెలిపారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మిస్తున్న పోలీస్ కార్యాలయాల సముదాయ స్థలాన్ని డీజీపీ మహేందర్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్బంగా అయన నిరుద్యోగులకు శుభవార్తనందించారు. అలాగే రాష్ట్రంలోని పాత నేరస్థులను గుర్తించేందుకు జియో ట్యాగింగ్ చేస్తున్నట్టు అయన తెలిపారు.

ఎన్నో సంవత్సరాలుగా తాము పడుతున్న కష్టాలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం జీతాలు పెంచినందుకు, హోంగార్డులు డీజీపీకి పుష్పగుచ్ఛం అందజేశారు. కాగా న్యాయం కోసం వచ్చే ఎవరికైనా అన్యాయం జరగకుండా కాపాడినప్పుడే పాలీసులు తమ వృత్తికి న్యాయం చేసినా వారు అవుతారని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com