భారతీయ మహిళకు అత్యవసర వీసా
- January 19, 2018
దుబాయ్లో చికిత్స పొందుతున్న భర్తను చూసేందుకోసం భారతీయ మహిళ ఒకరికి అత్యవసర వీసా మంజూరయ్యింది. తన భర్త బ్రెయిన్ స్ట్రోక్తో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారనీ, మెడికల్ ఎమర్జన్సీ కోటాలో తనకు అత్యవసర వీసా మంజూరు చేయాలని, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్కి గరిమా సోషల్ మీడియా ద్వారా తెలిపారు. తన భర్త పరిస్థితిపై వరుస ట్వీట్లతో సుష్మా స్వరాజ్కి ఆమె మొరపెట్టుకున్నారు. బాధితురాలి పరిస్థితిని అర్థం చేసుకున్న కేంద్ర మంత్రి, అత్యవసర వీసా మంజూరుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత అధికారిక వర్గాలు కేంద్ర మంత్రి ఆదేశాలతో గరిమాకి అత్యవసర వీసా మంజూరు చేశారు. అలాగే కాన్సులేట్ జనరల్ని అప్రమత్తం చేసి, దుబాయ్లో చికిత్స పొందుతోన్న గరిమా భర్తకి తగిన సహాయం అందించాల్సిందిగా సుష్మా స్వరాజ్ సూచించారు. కేంద్ర మంత్రి సూచనతో, కాన్సులేట్ ప్రతినిథులు, ఆసుపత్రికి వెళ్ళి, అక్కడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి