గాయపడ్డ కార్మికుడికి 1 మిలియన్ దిర్హామ్ నష్టపరిహారం
- January 21, 2018
యు.ఏ.ఈ:విధి నిర్వహణలో ఉండగా తీవ్రంగా గాయపడి మంచానికే పరిమితమైన ఓ కార్మికుడికి 1 మిలియన్ దిర్హామ్ నష్టపరిహారంగా చెల్లించాలని అబుదాబీ అపీల్ కోర్ట్ ఆదేశించింది. ఇద్దరు వ్యక్తులు ఈ ఘటనకు బాధ్యులుగా న్యాయస్థానం నిర్ధారించింది. కారకులైన ఇద్దరు ఆసియా కార్మికులు ఈ మొత్తాన్ని బాధితుడికి చెల్లించాల్సి ఉంటుంది. అబుదాబీలోని కన్స్ట్రక్షన్ సైట్లో ఈ ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న గోడ కూలిపోవడంతో బాధితుడి వెన్నుకి తీవ్రమైన గాయం తగిలింది. మిగతా శరీర భాగాలకూ గాయాలయ్యాయని మెడికల్ రిపోర్ట్ పేర్కొంది. బాధితుడు కోలుకుని, తిరిగి సాధారణ స్థితికి వచ్చే అవకాశం లేదని సప్లిమెంటరీ ఫోరెన్సిక్ రిపోర్ట్లో వైద్యులు వెల్లడించారు. బాధితుడి కుటుంబానికి వేరే ఆధారం లేనందున, అతని కుటుంబం ఆర్థికంగా చితికిపోకుండా, మనుగడ సాధించేందుకోసం నష్టపరిహారం తప్పనిసరి అని న్యాయస్థానంలో వాదనలు జరిగాయి.
తాజా వార్తలు
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్







