గాయపడ్డ కార్మికుడికి 1 మిలియన్ దిర్హామ్ నష్టపరిహారం
- January 21, 2018
యు.ఏ.ఈ:విధి నిర్వహణలో ఉండగా తీవ్రంగా గాయపడి మంచానికే పరిమితమైన ఓ కార్మికుడికి 1 మిలియన్ దిర్హామ్ నష్టపరిహారంగా చెల్లించాలని అబుదాబీ అపీల్ కోర్ట్ ఆదేశించింది. ఇద్దరు వ్యక్తులు ఈ ఘటనకు బాధ్యులుగా న్యాయస్థానం నిర్ధారించింది. కారకులైన ఇద్దరు ఆసియా కార్మికులు ఈ మొత్తాన్ని బాధితుడికి చెల్లించాల్సి ఉంటుంది. అబుదాబీలోని కన్స్ట్రక్షన్ సైట్లో ఈ ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న గోడ కూలిపోవడంతో బాధితుడి వెన్నుకి తీవ్రమైన గాయం తగిలింది. మిగతా శరీర భాగాలకూ గాయాలయ్యాయని మెడికల్ రిపోర్ట్ పేర్కొంది. బాధితుడు కోలుకుని, తిరిగి సాధారణ స్థితికి వచ్చే అవకాశం లేదని సప్లిమెంటరీ ఫోరెన్సిక్ రిపోర్ట్లో వైద్యులు వెల్లడించారు. బాధితుడి కుటుంబానికి వేరే ఆధారం లేనందున, అతని కుటుంబం ఆర్థికంగా చితికిపోకుండా, మనుగడ సాధించేందుకోసం నష్టపరిహారం తప్పనిసరి అని న్యాయస్థానంలో వాదనలు జరిగాయి.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి