గాయపడ్డ కార్మికుడికి 1 మిలియన్ దిర్హామ్ నష్టపరిహారం
- January 21, 2018యు.ఏ.ఈ:విధి నిర్వహణలో ఉండగా తీవ్రంగా గాయపడి మంచానికే పరిమితమైన ఓ కార్మికుడికి 1 మిలియన్ దిర్హామ్ నష్టపరిహారంగా చెల్లించాలని అబుదాబీ అపీల్ కోర్ట్ ఆదేశించింది. ఇద్దరు వ్యక్తులు ఈ ఘటనకు బాధ్యులుగా న్యాయస్థానం నిర్ధారించింది. కారకులైన ఇద్దరు ఆసియా కార్మికులు ఈ మొత్తాన్ని బాధితుడికి చెల్లించాల్సి ఉంటుంది. అబుదాబీలోని కన్స్ట్రక్షన్ సైట్లో ఈ ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న గోడ కూలిపోవడంతో బాధితుడి వెన్నుకి తీవ్రమైన గాయం తగిలింది. మిగతా శరీర భాగాలకూ గాయాలయ్యాయని మెడికల్ రిపోర్ట్ పేర్కొంది. బాధితుడు కోలుకుని, తిరిగి సాధారణ స్థితికి వచ్చే అవకాశం లేదని సప్లిమెంటరీ ఫోరెన్సిక్ రిపోర్ట్లో వైద్యులు వెల్లడించారు. బాధితుడి కుటుంబానికి వేరే ఆధారం లేనందున, అతని కుటుంబం ఆర్థికంగా చితికిపోకుండా, మనుగడ సాధించేందుకోసం నష్టపరిహారం తప్పనిసరి అని న్యాయస్థానంలో వాదనలు జరిగాయి.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు