గాయపడ్డ కార్మికుడికి 1 మిలియన్ దిర్హామ్ నష్టపరిహారం
- January 21, 2018
యు.ఏ.ఈ:విధి నిర్వహణలో ఉండగా తీవ్రంగా గాయపడి మంచానికే పరిమితమైన ఓ కార్మికుడికి 1 మిలియన్ దిర్హామ్ నష్టపరిహారంగా చెల్లించాలని అబుదాబీ అపీల్ కోర్ట్ ఆదేశించింది. ఇద్దరు వ్యక్తులు ఈ ఘటనకు బాధ్యులుగా న్యాయస్థానం నిర్ధారించింది. కారకులైన ఇద్దరు ఆసియా కార్మికులు ఈ మొత్తాన్ని బాధితుడికి చెల్లించాల్సి ఉంటుంది. అబుదాబీలోని కన్స్ట్రక్షన్ సైట్లో ఈ ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న గోడ కూలిపోవడంతో బాధితుడి వెన్నుకి తీవ్రమైన గాయం తగిలింది. మిగతా శరీర భాగాలకూ గాయాలయ్యాయని మెడికల్ రిపోర్ట్ పేర్కొంది. బాధితుడు కోలుకుని, తిరిగి సాధారణ స్థితికి వచ్చే అవకాశం లేదని సప్లిమెంటరీ ఫోరెన్సిక్ రిపోర్ట్లో వైద్యులు వెల్లడించారు. బాధితుడి కుటుంబానికి వేరే ఆధారం లేనందున, అతని కుటుంబం ఆర్థికంగా చితికిపోకుండా, మనుగడ సాధించేందుకోసం నష్టపరిహారం తప్పనిసరి అని న్యాయస్థానంలో వాదనలు జరిగాయి.
తాజా వార్తలు
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?
- కుటుంబ సభ్యుల 72 రోజుల నిరీక్షణ ముగిసింది
- తెలంగాణ: డీజీపీ ఎదుట లొంగిపోయిన నలుగురు అగ్రనేతలు
- ‘Sahl’ ద్వారా వెహికల్ డ్రైవింగ్ ఆథరైజేషన్ సర్వీస్..!!
- హమద్ టౌన్, జనబియా రోడ్లలో సేఫ్టీ పెంపు..!!
- కోఆర్డినేట్లను ఉపసంహరించుకోండి..ఇరాక్ కు జిసిసి చీఫ్ పిలుపు..!!
- దుబాయ్, షార్జాలో పలు ఫ్లైట్స్ డిలే.. క్యాన్సిల్..!!









