మత సామరస్యానికి ప్రతీక.. దర్గాలో వసంత పంచమి వేడుక
- January 21, 2018వసంత పంచమి వేడుకలను హిందువులు జరుపుకోవడం మామూలే. మతసామరస్యానికి ప్రతీకగా ముస్లిం సోదర, సోదరీమణులు కూడా ఈ వేడుకల్లో పాలు పంచుకోవడం దేశ రాజధాని ఢిల్లీలో ఆనవాయితీగా వస్తున్న ఆచారం. ఇది ఏదో ఒకటీ రెండు ఏళ్లుగా వస్తున్న సంప్రదాయం కాదు. దాదాపు ఏడువందల సంవత్సరాలుగా ఈ వేడుకల్ని హజ్రత్ నిజాముద్దీన్ దర్గాలో సూఫీ వసంత పంచమి వేడుకలు జరుగుతాయి. అయితే అదే స్ఫూర్తితో మన హైదరాబాదులోని ఓ దర్గాలో కూడా ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. చార్మినార్ సమీప పత్తర్ గట్టీ ఉర్దూ గల్లీలోని హజ్రత్ షేక్జీ హలీ అబుల్ ఉలాయి దర్గాలో ఈ వేడుకలు జరుగుతాయి. తొలిసారి ఈ వేడుకలు 2015లో జరిగాయి. దర్గా హాలులో కనువిందు చేసే విద్యుత్ దీపాలంకరణ చేశారు. ఈ ఉత్సవాలకు రాష్ట్ర సాంస్కృతిక శాఖ సహకారం అందిస్తోంది.
అసలు 12వ శతాబ్దంలోనే ముస్లింలు ఈ వసంత పంచమి వేడుకల్ని జరుపుకోవడం ఆరంభమైంది. ఈ వేడుకలు నిర్వహించడానికి ప్రధాన కారణం ముస్లిం మత గురువైన నిజాముద్దీన్, మేనల్లుడి హఠాన్మరణంతో దిగులు చెందుతున్నాడు. అతడిని ఆ బాధ నుంచి బయటకు తీసుకురావడానికి అమీర్ ఖుస్రో ఈ వేడుకల్ని నిర్వహించారట. మన దేశంలోనే కాదు పాకిస్తాన్లో కూడా సూఫీ వసంత పంచమి కార్యక్రమాలు జరుగుతాయి. ఈ వేడుకల్లో భాగంగా అమీర్ ఖుస్రో వసంత పంచమి, సంగీత వాయిద్యాలపై రాసిన కవితలు, పాటలు భాగ్యనగరంలోని పత్తర్గట్టీ దర్గాలో ఆలపిస్తారు.
తాజా వార్తలు
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు