ఢిల్లీలో హైఅలర్ట్
- January 22, 2018_1516688280.jpg)
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. ఈ వారం రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని నిఘా వర్గాలు.. ఢిల్లీ పోలీసులను హెచ్చరించాయి. ఈ వారంలోనే గణతంత్య్ర దినోత్సవ వేడుకలు, ఢిల్లీ వేదికగా జరగనున్న ఏషియన్ సమ్మిట్, పద్మావత్ సినిమా విడుదల నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజ్పథ్తో పాటు ఢిల్లీలోని సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు నిఘా పెంచారు. పద్మావత్ సినిమా విడుదలను అడ్డుకుంటామని ఆందోళనకారులు హెచ్చరిస్తుండటంతో.. పోలీసులకు సవాల్గా మారింది. ఈ మూడు ఈవెంట్స్ పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. జనవరి 24 నుంచి 26 ఏషియన్ సమ్మిట్ జరగనుంది. 25న పద్మావత్ విడుదల కానుంది. 26న రిపబ్లిక్ డే వేడుకలు జరగనున్నాయి. గణతంత్య్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో రాజ్పథ్లో పోలీసులు రిహార్సల్స్ నిర్వహిస్తున్నారు. రాజ్పథ్ వద్ద ఎన్ఎస్జీ కమాండోస్, స్పెషల్ ఫోర్స్ బందోబస్తులో ఉన్నాయి.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక