ఎమిరేట్స్ రోడ్డుపై ప్రమాదం: ఇద్దరి మృతి
- January 23, 2018దుబాయ్: ఓ ట్రక్, ఓ మినీ బస్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. షార్జా వైపుగా ఎమిరేట్స్ రోడ్డులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో ఏడుగురు గాయాల పాలైనట్లు దుబాయ్ పోలీస్ వెల్లడించింది. దుబాయ్ పోలీస్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కల్నల్ జుమా సలెమ్ బిన్ సువైదాన్ మాట్లాడుతూ, శనిరవా రాత్రి 7 గంటల సమయంలో జరిగిన మర ప్రమాదంలో నలుగురు వ్యక్తులు గాయాల పాలయ్యారు. మూడు వాహనాలు ఈ ప్రమాదంలో తీవ్రంగా ధ్వంసమయ్యాయి. షేక్ జాయెద్ రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. వాహనం ట్రాఫిక్ లేన్ డిసిప్లిన్ని పాటించకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ఆయన వివరించారు. శనివారం ఉదయం 11 గంటల సమయంలో అల్ ఖయిల్ రోడ్డుపై జరిగిన మరో ప్రమాదంలో ఓ మోటరిస్ట్ గాయాల పాలయ్యాడు. వాహనదారులు రోడ్డు నిబంధనల్ని పాటించాలని ఈ సందర్భంగా పోలీసు అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- భారత్కు మరో దౌత్య విజయం
- ‘జగన్ 2.0 ప్రచారం జోష్..’: వాడ వాడల్లో స్టార్ క్యాంపెయినర్లు
- ఎన్నికల వేళ TSRTC ప్రత్యేక బస్సులు..
- తెలంగాణ మోడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాల కోసం నోటిఫికేషన్
- సౌదీలో 3-సెమిస్టర్ విధానంపై అధ్యయనం పూర్తి..!
- కుమార్తెలను శారీరకంగా హింసించిన తండ్రి అరెస్ట్
- కువైట్లో పెరగనున్న ఉష్ణోగ్రతలు..!
- ఒమానీ విశ్వవిద్యాలయాలపై రేటింగ్ ప్రారంభం
- దోహా ఇంటెర్నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం
- ఫీజులు, ప్రయాణ సమయాలను తగ్గించాలి..పేరెంట్స్