టెర్రరిస్ట్ల నుంచి అమర్నాథ్ యాత్రికులను కాపాడిన డ్రైవర్కు రెండో అత్యుత్తమ సాహస అవార్డు
- January 24, 2018
శ్రీనగర్: కొద్ది నెలల క్రితం ఉగ్రవాదుల నుంచి 52 మంది అమర్నాథ్ యాత్రికులను కాపాడిన గుజరాత్కు చెందిన బస్సు డ్రైవర్ షేక్ సలీం గఫూర్ ఉత్తమ్ జీవన్ రక్షా పాదక్ అవార్డుకు ఎంపికయ్యారు. అరుదైన సాహసాన్ని ప్రదర్శించే పౌరులకు ఇది ఇస్తారు.
భారత గణతంత్ర దినం సందర్భంగా ఈ అవార్డును ప్రకటించారు. ఈ మేరకు హోంశాఖ బుధవారం ఓ ప్రకటన చేసింది. ఈ తరహా అవార్డుల్లో దీనిని రెండో ఉత్తమ పురస్కారంగా పేర్కొంటారు.
గత ఏడాది జూలై 10వ తేదీన గుజరాత్కు చెందిన బస్సులో యాత్రికులను తీసుకొని అనంత్ నాగ్ జిల్లా బటేంగూ ప్రాంతానికి వచ్చిన సమయంలో తీవ్రవాదులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే.
ఈ ఘటనలో ఆరుగురు యాత్రికులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. చుట్టూ చీకటి ఉన్నా తీవ్రవాదులు బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నా గఫూర్ గుండెధైర్యంతో బస్సును ముందుకు పోనిచ్చి, యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తీసుకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఈయనకు ఈ అవార్డు ఇచ్చారు. దీంతో పాటు 26వ తేదీ తర్వాత జరిగే మరో కార్యక్రమంలో రూ.లక్ష నగదుతో పాటు పురస్కారంతో సత్కరిస్తారు.
తాజా వార్తలు
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!







