టెర్రరిస్ట్ల నుంచి అమర్నాథ్ యాత్రికులను కాపాడిన డ్రైవర్కు రెండో అత్యుత్తమ సాహస అవార్డు
- January 24, 2018
శ్రీనగర్: కొద్ది నెలల క్రితం ఉగ్రవాదుల నుంచి 52 మంది అమర్నాథ్ యాత్రికులను కాపాడిన గుజరాత్కు చెందిన బస్సు డ్రైవర్ షేక్ సలీం గఫూర్ ఉత్తమ్ జీవన్ రక్షా పాదక్ అవార్డుకు ఎంపికయ్యారు. అరుదైన సాహసాన్ని ప్రదర్శించే పౌరులకు ఇది ఇస్తారు.
భారత గణతంత్ర దినం సందర్భంగా ఈ అవార్డును ప్రకటించారు. ఈ మేరకు హోంశాఖ బుధవారం ఓ ప్రకటన చేసింది. ఈ తరహా అవార్డుల్లో దీనిని రెండో ఉత్తమ పురస్కారంగా పేర్కొంటారు.
గత ఏడాది జూలై 10వ తేదీన గుజరాత్కు చెందిన బస్సులో యాత్రికులను తీసుకొని అనంత్ నాగ్ జిల్లా బటేంగూ ప్రాంతానికి వచ్చిన సమయంలో తీవ్రవాదులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే.
ఈ ఘటనలో ఆరుగురు యాత్రికులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. చుట్టూ చీకటి ఉన్నా తీవ్రవాదులు బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నా గఫూర్ గుండెధైర్యంతో బస్సును ముందుకు పోనిచ్చి, యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తీసుకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఈయనకు ఈ అవార్డు ఇచ్చారు. దీంతో పాటు 26వ తేదీ తర్వాత జరిగే మరో కార్యక్రమంలో రూ.లక్ష నగదుతో పాటు పురస్కారంతో సత్కరిస్తారు.
తాజా వార్తలు
- బాసర సరస్వతి అమ్మవారి ఆలయ సమీపంలో పేలుడు శబ్దాలు..
- యూకేని భయపెడుతున్న ‘100 రోజుల దగ్గు’..
- 100 మంది దుబాయ్ డ్రైవర్లకు 50,000 దిర్హామ్ల జరిమానా
- మస్కట్ విమానాశ్రయంలో ఫ్రీ జోన్ ఏర్పాటుకు ఒప్పందం
- ప్రముఖ 'హిడెన్' బీచ్ తాత్కాలికంగా మూసివేత
- అబ్దల్లిలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు ఈజిప్టు ప్రవాసులు మృతి
- సైబర్ సెక్యూరిటీలో గ్లోబల్ సహకారానికి బహ్రెయిన్ పిలుపు
- సేవల్లో నిర్లక్ష్యం.. అనేక ఉమ్రా కంపెనీల లైసెన్స్లు రద్దు
- కర్ణాటకలో ఘోర ప్రమాదం..కారు చెరువులో పడి నలుగురు మృతి
- కేసీఆర్ని పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి