రోహింగ్యాలు మయన్మార్‌కు వెళ్లడం ఇంకా క్షేమకరం కాదు..

- January 25, 2018 , by Maagulf
రోహింగ్యాలు మయన్మార్‌కు వెళ్లడం ఇంకా క్షేమకరం కాదు..

*యునెసెఫ్‌ అధికారి జస్టిన్‌ ఫోర్సిత్‌ 
బంగ్లాదేశ్‌: బాంగ్లాదేశ్‌ నుంచి రోహింగ్యాలు తిరిగి మయన్మార్‌కు వెళ్లడం ఇంకా క్షేమకరం కాదని యునెసెఫ్‌ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ జస్టిన్‌ ఫోర్సిత్‌ పేర్కొన్నారు. ఆయన బుధవారం కుటుపాలాంగ్‌ వద్ద శరణార్థుల శిబిరాన్ని సందర్శించారు. 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ఇక్కడి శరణార్థులు మయన్మార్‌లోని తమ బంధువులతో మాట్లాడుతున్నప్పుడు అక్కడి ఇంకా హింస కొనసాగుతోందని చెబుతున్నారని, ఇప్పుడు తిరిగి ఇళ్లకు రావడం క్షేమం కాదని చెబుతున్నట్లు పేర్కొన్నారు. రోహింగ్యాలు వారి స్వగ్రామాలకు తిరిగి వెళ్లడానికి వీలుగా బంగ్లాదేశ్‌ా మయన్మార్‌ల మధ్య ఒప్పందం కుదిరింది. అయితే రోహింగ్యాల ఇష్టత, వారి క్షేమం దృష్ట్యా మరి కొంత సమయం అవసరమని తెలిపిన విషయం విదితమే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com