భారీగా పెరిగిన బంగారం ధర
- January 25, 2018
బంగారానికి మళ్లీ రెక్కలు వచ్చాయి. గురువారం నాటి మార్కెట్లో బంగారం ధర మళ్లీ పెరిగింది. దాదాపు రెండేళ్ల గరిష్టానికి పసిడి ధర ఎగబాకింది. మరోవైపు డాలర్ విలువ మూడేళ్ల కనిష్టానికి పడిపోయింది. నేటి మార్కెట్లో రూ.156 పెరిగి పది గ్రాముల బంగారం ధర రూ.30,405కి చేరుకుంది.
అంతర్జాతీయ మార్కెట్లో 0.3శాతం పెరిగి ఔన్సు బంగారం ధర 1360.60డాలర్లకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో 2016 ఆగస్టు నెల తర్వాత బంగారం ధర ఈ స్థాయికి చేరుకోవడం ఇదే తొలిసారని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. పసిడి ధర మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. వెండి కూడా పసిడి బాటలోనే నడిచింది. అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధర 0.2శాతం పెరిగింది.
తాజా వార్తలు
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!







