ఆనంద్‌మహీంద్రాతో మంత్రి కేటీఆర్ భేటీ

- January 25, 2018 , by Maagulf
ఆనంద్‌మహీంద్రాతో మంత్రి కేటీఆర్ భేటీ

దావోస్: మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా, సీఈవో సీపీ గుర్నానితో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. వరంగల్‌లో టెక్ మహీంద్రా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా ఆనంద్ మహీంద్రా కేటీఆర్ కు తెలిపారు. టెక్ మహీంద్రా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్న ఆనంద్ మహీంద్రాకు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలియజేశారు. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో పాల్గొంటున్న మంత్రి కేటీఆర్.. ఎయిర్ ఏసియా, నోవార్టిస్, మిత్సుబిషి, హ్యూలెట్ ప్యాకర్డ్ (హెచ్‌పీ), హిటాచీ, ఫవద్ అల్గానిమ్ కంపెనీ, ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ దుబాయ్ తదితర ప్రముఖ కంపెనీల ప్రముఖులతో ఇప్పటికే సమావేశమైన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com