అమర్ జ్యోతి వద్ద ప్రధాని నివాళులు

- January 25, 2018 , by Maagulf
అమర్ జ్యోతి వద్ద ప్రధాని నివాళులు

న్యూఢిల్లీ: 69వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. రిపబ్లిక డే వేడుకల్లో భాగంగా ఢిల్లీలోని రాజ్‌పథ్ మార్గ్ అమర్‌జవాన్ జ్యోతి స్తూపం వద్ద ప్రధాని ఘనంగా నివాళులర్పించారు. ప్రధానితోపాటు త్రివిధ దళాల అధిపతులు అమర్‌జవాన్ జ్యోతి స్తూపానికి సెల్యూట్ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ, ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్, ఎయిర్‌ఫోర్స్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ బీరేందర్‌సింగ్ ధనోవా, నేవీ చీఫ్ అడ్మైరల్ సునీల్ లంబా రెండు నిమిషాలు మౌనం పాటించి అమరజవాన్లకు నివాళులర్పించారు. ప్రధాని నరేంద్రమోదీ దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com