నాగ శౌర్య లో నన్ను నేను చూసుకున్నా..చిరంజీవి

- January 26, 2018 , by Maagulf
నాగ శౌర్య లో నన్ను నేను చూసుకున్నా..చిరంజీవి

నాగ శౌర్య హీరోగా తొలిసారిగా వెంకీ కుడుముల దర్శకుడిగా వెండి తెరకు పరిచయం అవుతున్న సినిమా ఛలో.. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. ఈ వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ... తాను ఏ పరిచయం లేని నాగశౌర్య ఫంక్షన్ కు చిరంజీవి వచ్చాడు ఏమిటి అనుకుంటున్నారా..? నన్ను కలవాలను నాగశౌర్య రెండు సార్లు మా ఆఫీసుకు ఫోన్ చేశాడు. ఆ సమయంలో నేను లేను. అనంతరం నన్ను కలవాలని నాగశౌర్య తన తల్లి ఉషగారితో మా ఇంటికొచ్చాడు. మా ఛలో ప్రీ రిలీజ్ వేడుక మీ సమక్షంలో జరుపుకోవాలని మేము కోరుకుంటున్నాం అని అడిగితే... నేను వెంటనే అంగీకరించాను. అలా అంగీకరించడానికి కారణం... నేను హీరోగా అడుగు పెట్టిన తొలి రోజుల్లో నా సినిమా శతదినోత్సవ వేడుక్కి నేను అభిమానించే ఓ పెద్ద స్టార్ హీరోను అతిధిగా పిలిచాను. ఆయన నా ఫంక్షన్ కు అతిధిగా వస్తే.. ఉత్సాహం, ప్రోత్సాహం బాగుంటుంది అని భావించాను. కానీ ఆ హీరో బిజీ ఉండి రాలేక పోయారు. ఆ రోజు ఆ ఫంక్షన్ ను తూతూ మంత్రం గా జరుపుకొన్నాం.. ఆ సమయంలో నేను చాలా నిరుత్సాహ పడ్డా... అది గుర్తుకు వచ్చింది.. నాగ శౌర్య లో నన్ను నేను చూసుకున్నా.. నా లాంటి వాళ్ళు వెళ్తే తనకు ఇచ్చే ప్రోత్సాహం.. ఉత్సాహం వేరు అందుకనే ఛలో ప్రీ రిలీజ్ వెడుక్కి వస్తా అని అన్నా.. అని తన జీవితంలో చోటు చేసుకొన్న సంఘటన ను ఈ వేడుకలో గుర్తు చేసుకొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com