అంగరంగ వైభవంగా 'రెహ్మాన్‌' కాన్సెర్ట్‌

- January 27, 2018 , by Maagulf

దుబాయ్:జనవరి 26న సంగీత మాంత్రికుడు ఎ.ఆర్‌.రెహమాన్‌ కాన్సెర్ట్‌ అంగరంగ వైభవంగా జరిగింది. బాలీవుడ్‌ పార్క్స్‌లో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఆహూతులు అత్యద్భుతంగా ఎంజాయ్‌ చేశారు. రెహమాన్‌ లైవ్‌ పెర్ఫామెన్స్‌కి తోడు, అర్మాన్‌ మాలిక్‌, నీతి మోహన్‌, బెన్నీ దయాల్‌, జోనితా గాంధీ, హరిచరణ్‌ శేషాద్రి, హర్షదీప్‌ కౌర్‌, జావెద్‌ అలీ ఈ కార్యక్రమానికి విచ్చేసినవారిని అలరించారు, తమ పాటలతో సంగీత ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోయారు. కనీ వినీ ఎరుగని రీతిలో తీర్చిదిద్దిన స్టేజ్‌, మిరుమిట్లు గొలిపే దీప కాంతులు, ఒకటేమిటి రెహమాన్‌ కాన్సెర్ట్‌ నభూతో నభవిష్యతి అనే రేంజ్‌లో జరిగింది. 'కాదల్‌ దేశం'లోని 'ముస్తఫా ముస్తఫా' సాంగ్‌కి ఆడియన్స్‌ సైతం పదం, పాదం రెండూ కలిపేశారు. స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్‌ వరకూ ఈ ప్రోగ్రామ్‌ అత్యద్బుతంగా సాగింది. ఎముకలు కొరికే చలిని, మంచునీ ఎవరూ లెక్క చేయలేదు. ఓ పక్క హీటెక్కించే పెర్ఫామెన్స్‌లు, ఇంకోపక్క చలి రెండూ బ్యాలెన్స్‌ అయిపోయాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com