దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు
- January 27, 2018
జోహన్స్బర్గ్లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరి టెస్టులో టీంఇండియా విక్టరీ కొట్టింది. బౌన్సీ పిచ్ పై సఫారీ ఆటగాళ్లను ఎట్టకేలకు మట్టి కరిపించి క్లీన్ స్వీప్ నుండి బయటపడింది. దీంతో టీమిండియా 63 పరుగుల తేడాతో విజయ దుందుభి మోగించింది. టీమిండియా బౌలర్లలో షమీ 4 వికెట్లు తీయగా, బుమ్రా, ఇషాంత్ శర్మలకి రెండేసి వికెట్లు, భువనేశ్వర్ కుమార్కి ఒక వికెట్ దక్కాయి. కాగా, మొదటి ఇన్నింగ్స్లో భారత్ 187 పరుగులకి ఆలౌట్ కాగా, దక్షిణాఫ్రికా 194 పరుగులకి ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. రెండో ఇన్నింగ్స్ లో బరిలోకి దిగిన భారత్ 247 పరుగులు చేసింది. 241 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభిన దక్షిణాఫ్రికా 177 పరుగులకే కుప్పకూలింది. దీంతో 63 పరుగుల తేడాతో విజయాన్నందుకుంది భారత్, అలాగే 1-2 సిరీస్ ను కోల్పోయింది.
తాజా వార్తలు
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!









