దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు
- January 27, 2018
జోహన్స్బర్గ్లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరి టెస్టులో టీంఇండియా విక్టరీ కొట్టింది. బౌన్సీ పిచ్ పై సఫారీ ఆటగాళ్లను ఎట్టకేలకు మట్టి కరిపించి క్లీన్ స్వీప్ నుండి బయటపడింది. దీంతో టీమిండియా 63 పరుగుల తేడాతో విజయ దుందుభి మోగించింది. టీమిండియా బౌలర్లలో షమీ 4 వికెట్లు తీయగా, బుమ్రా, ఇషాంత్ శర్మలకి రెండేసి వికెట్లు, భువనేశ్వర్ కుమార్కి ఒక వికెట్ దక్కాయి. కాగా, మొదటి ఇన్నింగ్స్లో భారత్ 187 పరుగులకి ఆలౌట్ కాగా, దక్షిణాఫ్రికా 194 పరుగులకి ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. రెండో ఇన్నింగ్స్ లో బరిలోకి దిగిన భారత్ 247 పరుగులు చేసింది. 241 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభిన దక్షిణాఫ్రికా 177 పరుగులకే కుప్పకూలింది. దీంతో 63 పరుగుల తేడాతో విజయాన్నందుకుంది భారత్, అలాగే 1-2 సిరీస్ ను కోల్పోయింది.
తాజా వార్తలు
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?
- 8 రోజుల్లో 28వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- UNRWAకు మద్దతు కొనసాగుతుంది: ఖతార్







