వైద్య విద్యలో మార్పులు

- January 27, 2018 , by Maagulf
వైద్య విద్యలో మార్పులు

విశాఖపట్నం: జాతీయ వైద్య విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకువస్తున్నట్టు భారత ప్రభుత్వ వైద్య విద్యావిభాగం సహాయ డైరెక్టర్‌ జనరల్‌, నీట్‌ ప్రధాన అధికారి డాక్టర్‌ బీ శ్రీనివాస్‌ వెల్లడించారు. గీతం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ వార్షిక వేడుకలకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. వైద్య విద్యలో థియరీ కంటే క్లినికల్‌ శిక్షణకు అధిక ప్రాధాన్యం ఇచ్చేలా భవిష్యత్తులో సిలబస్‌ను మార్పు చేయనున్నట్టు వెల్లడించారు. ఎంసీఐ స్థానంలో జాతీయ వైద్య మండలి(నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌) ఏర్పాటుకు జరుగుతున్న ప్రయత్నాలను వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com