అమెరికాలో తెలుగు టెకీ అనుమానాస్పద మృతి
- January 28, 2018
హైదరాబాద్: అమెరికాలో తెలంగాణకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి అనుమానాస్పదరీతిలో ప్రాణాలు కోల్పోయాడు. గత శుక్రవారం డల్లాస్లో వెంకన్నగారి కృష్ణచైతన్య తన గదిలో ప్రాణాలు విడిచాడు. డల్లాస్లోని ఓ ఇంట్లో కృష్ణచైతన్య పేయింగ్ గెస్ట్గా ఉంటున్నాడు. శుక్రవారం ఉదయం తన గది నుంచి బయటకు రాకపోవటంతో అనుమానం వచ్చిన ఇంటి యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు గది తలుపు తీసి చూడగా.. మంచం మీద కృష్ణ చైతన్య చనిపోయి కనిపించాడు. కృష్ణ చైతన్యది సిద్దిపేటలోని ప్రశాంత్ నగర్ స్వస్థలం. కాగ్నిజెంట్ కంపెనీ ఉద్యోగంలో భాగంగా మూడున్నరేళ్ల క్రితం ఆయన అమెరికాకు వెళ్లారు. మూడు నెలల కిందటే డల్లాస్లోని సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ కంపెనీకి ఉద్యోగం మారటంతో అక్కడే ఓ ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా ఉంటున్నాడు.
తెలంగాణ ఎన్ఆర్ఐ విభాగం ప్రతినిధులు గోలి మోహన్, శ్రీధర్ మాధవనేని ఆధ్వర్యంలో కృష్ణచైతన్య మృతదేహాన్ని స్వస్థలానికి పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తరపున సంప్రదింపులు జరిపి సకాలంలో భౌతికకాయాన్ని తరలించేలా మంత్రి హరీశ్రావు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. పోస్టుమార్టం, తదితరాలు పూర్తయిన అనంతరం గురువారంలోగా మృతదేహం హైదరాబాద్ కు చేరుకోనుంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి