అమెరికాలో తెలుగు టెకీ అనుమానాస్పద మృతి
- January 28, 2018
హైదరాబాద్: అమెరికాలో తెలంగాణకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి అనుమానాస్పదరీతిలో ప్రాణాలు కోల్పోయాడు. గత శుక్రవారం డల్లాస్లో వెంకన్నగారి కృష్ణచైతన్య తన గదిలో ప్రాణాలు విడిచాడు. డల్లాస్లోని ఓ ఇంట్లో కృష్ణచైతన్య పేయింగ్ గెస్ట్గా ఉంటున్నాడు. శుక్రవారం ఉదయం తన గది నుంచి బయటకు రాకపోవటంతో అనుమానం వచ్చిన ఇంటి యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు గది తలుపు తీసి చూడగా.. మంచం మీద కృష్ణ చైతన్య చనిపోయి కనిపించాడు. కృష్ణ చైతన్యది సిద్దిపేటలోని ప్రశాంత్ నగర్ స్వస్థలం. కాగ్నిజెంట్ కంపెనీ ఉద్యోగంలో భాగంగా మూడున్నరేళ్ల క్రితం ఆయన అమెరికాకు వెళ్లారు. మూడు నెలల కిందటే డల్లాస్లోని సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ కంపెనీకి ఉద్యోగం మారటంతో అక్కడే ఓ ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా ఉంటున్నాడు.
తెలంగాణ ఎన్ఆర్ఐ విభాగం ప్రతినిధులు గోలి మోహన్, శ్రీధర్ మాధవనేని ఆధ్వర్యంలో కృష్ణచైతన్య మృతదేహాన్ని స్వస్థలానికి పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తరపున సంప్రదింపులు జరిపి సకాలంలో భౌతికకాయాన్ని తరలించేలా మంత్రి హరీశ్రావు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. పోస్టుమార్టం, తదితరాలు పూర్తయిన అనంతరం గురువారంలోగా మృతదేహం హైదరాబాద్ కు చేరుకోనుంది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







