బహ్రెయిన్ ప్రీమియర్ లీగ్ 2018 టి 20 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
- January 28, 2018_1517197443.jpg)
మనామ : గల్ఫ్ లో క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పడా అని ఎదురు చూస్తున్న టి 20 క్రికెట్ టోర్నీ షెడ్యూల్ రానే వచ్చింది. బహ్రెయిన్ లో మొట్టమొదటి ఫ్రాంచైజ్ ఆధారిత టి 20 క్రికెట్ టోర్నమెంట్ ఇసా టౌన్ లో గౌరవనీయ శ్రీ షేక్ ఖాలిద్ బిన్ హమద్ అల్ ఖలీఫా యొక్క ఆధ్వర్యంలో నిర్వహించబడనుంది. ఈ కార్యక్రమంలో ఎగ్జిలోన్ కలిసి మహమ్మద్ షాహిద్ నేతృత్వంలోని కె హెచ్ కె స్పోర్ట్స్ కొనసాగనుంది. బహ్రెయిన్ ప్రీమియర్ లీగ్ అధ్యక్షుడు మహమ్మద్ మన్సూర్ ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం ప్రారంభించారు. బహ్రెయిన్ ప్రీమియర్ లీగ్ మొట్టమొదటి ఎడిషన్ టి 20 క్రికెట్ టోర్నమెంట్ లో ఆరు క్రికెట్ జట్లు పోటీ పడతాయి. అవి ఇన్టక్స్ లయన్స్, సారమ్రమ్ ఫాల్కన్స్, బహ్రెయిన్ సూపర్జియాట్స్, బహ్రెయిన్ నైట్ రైడర్స్, అవాన్ వారియర్స్ మరియు ఫోర్ స్కయర్ ఛాలెంజర్స్ ఉన్నాయి. బహ్రెయిన్ లో క్రికెట్ క్రీడను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో వివిధ ప్రవాసియ సమాజంలో స్నేహం ఐక్యతలు పెంపొందించేందుకు ఈ టోర్నమెంట్ దోహదపడతుంది. క్రికెట్ క్రీడ సైతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని రాబట్టుకునేందుకు ఉపయోగపడుతుంది. క్రికెట్ నేపథ్యంలో మీడియా టెక్నాలజీ, ఉపాధి అవకాశాలు కలగడమే కాక ప్రపంచ దృష్టిని బహ్రెయిన్ దేశం ఆకర్షిస్తుంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి