భారత్కి సలామ్ ఎయిర్ విమానాలు!
- January 29, 2018
మస్కట్: ఒమన్ తొలి బడ్జెట్ ఎయిర్లైన్ సలామ్ ఎయిర్, ఇండియాకి విమాన సర్వీసుల్ని ప్రారంభించనుంది. ఇండియా, తమకు సక్సెస్ఫుల్ రూట్గా మారుతుందని సలామ్ ఎయిర్ సీఈఓ కెప్టెన్ మొహమ్మద్ అహ్మద్ చెప్పారు. ఇండియాకి విమానాలు నడిపేందుకుగాను సంబంధిత అధికార వర్గాల నుంచి క్లియరెన్స్ కోసం ఎదురుచూస్తున్నట్లు ఆయన వివరించారు. ఇండియాలో ఎక్కడికి విమానాలు నడిపినా, అది తమకు లాభదాయకంగానే ఉంటుందని చెప్పారాయన. ఇండియా - ఒమన్ మధ్య 2016లో కుదిరిన ఒప్పందం ప్రకారం, వారానికి 27,405 సీట్లకు (ఇరువైపులా) అనుమతి లభించింది. గతంలో ఈ సంఖ్య 21,145గా ఉండేది. తమ వెబ్సైట్ ద్వారా ట్రావెల్ ప్యాకేజీలను వెల్లడించనున్నట్లు కెప్టెన్ మొహమ్మద్ అహ్మద్ చెప్పారు. ఈ సమ్మర్లో బాకు (అజర్బైజాన్), త్బిలిసి (జార్జియా)లకు విమానాలు ప్రత్యేకంగా నడిపే యోచన చేస్తున్నట్లు వెల్లడించారాయన. ఉమ్రా ప్యాకేజీలను సైతం సలామ్ ఎయిర్ ప్లాన్ చేస్తోంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి