మలేషియాలో వెలుస్తున్న తెలుగు అకాడమీ
- January 30, 2018
హైదరాబాద్: మలేషియాలో తెలుగు వారికోసం అకాడమీని ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం అకాడమీ కోసం నిర్మాణ పనులు జోరుగా జరుగుతున్నాయి. ఆ దేశంలో ఉన్న తెలుగు సంఘం.. కౌలాలంపూర్లో ఈ అకాడమీని ఏర్పాటు చేస్తోంది. ఇది సమీప దేశాల్లో ఉన్న తెలుగువారి కోసం ఉపయోగపడుతుంది. తెలుగు అసోసియేషన్ ఆఫ్ మలేషియా ఈ అకాడమీని నిర్మిస్తున్నది. కౌలాలంపూర్కు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న రవాంగ్ సెలంగర్ ప్రాంతంలో సుమారు 2.5 ఎకరాల స్థలంలో అకాడమీని నిర్మిస్తున్నారు. తెలుగు భాషతో పాటు డ్యాన్స్, మ్యూజిక్, ఆర్ట్స్, ఇతర కళలను కూడా అక్కడ నేర్చుకునే వీలుందని టామ్ ప్రెసిడెంట్ వై.అచ్చయ్య కుమార్ రావు తెలిపారు. మలేషియాలో తెలుగు నేర్చుకుంటున్న సుమారు మూడు వేల మందికి ఈ అకాడమీ వల్ల లాభం చేకూరే అవకాశాలున్నాయి. పొట్టి శ్రీరాములు వర్సిటీకి చెందిన ప్రొఫెసర్లు విద్యార్థులకు ప్రశ్నాపత్రాలు తయారు చేయనున్నారు. అకాడమీ నిర్మాణం కోసం రూ.40 కోట్లు ఖర్చు చేయనున్నారు. మార్చి 2016లో దీని కోసం శంకుస్థాపన జరిగింది. అయితే మలేషియా ప్రభుత్వం తెలుగు అకాడమీ కోసం 25 కోట్లు కేటాయించింది.
తెలుగు రాష్ర్టాల సీఎంలను త్వరలో మలేషియాకు ఆహ్వానించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు తెలిపారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి