హజ్ మొదటి విడత చెల్లింపునకు ఫిబ్రవరి 12వ తేదీ కు పొడిగించిన కమిటీ
- January 30, 2018
అమరావతి : హజ్ యాత్రికులు మొదటి విడత 81 వేల రూపాయలు చెల్లింపునకు, ఫిబ్రవరి 12వ తేదీ వరకు గడువు పెంచుతూ సెంట్రల్ హజ్ కమిటీ నిర్ణయం తీసుకుందని ఎపి స్టేట్ హజ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మహమ్మద్ లియాఖత్ అలీ మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. జనవరి 31వ తేదీన మొదటి విడత చెల్లించడానికి గడువు ముగుస్తున్న నేపథ్యంలో సెంట్రల్ హజ్ కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రతి హజ్ యాత్రికుడు 81 వేల రూపాయలు బ్యాంక్లో జమ చేసినట్లు ఒరిజినల్ బ్యాంక్ పే ఇన్ స్లిప్, మెడికల్ స్క్రీనింగ్ అండ్ ఫిట్నెస్ సర్టిఫికెట్, ఒరిజినల్ పాస్పోర్ట్, వైట్ బ్యాగ్గ్రౌండ్ కలర్ ఫొటోలను విజయవాడలోని ఎపి స్టేట్ హజ్ కమిటీ కార్యాలయంలో వెంటనే అందజేయాలని తెలిపారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి