పీపాల కొద్ది ఆయిల్ . విధ్యుత్ తీగలను దొంగిలించిన నిందితులు అరెస్ట్
- January 31, 2018_1517414655.jpg)
కువైట్ : కుళాయి తిప్పుకొని దాహం తీర్చుకొన్నమాదిరిగా ..నూతులలో ఊరే ఆయిల్ గదా ..ఆర్ధిక ఇబ్బందుల దృష్ట్యా కొద్దిగా తోడుకున్నామంతే అంటున్న కువైట్, సౌదీ దేశాలకు చెందిన ఇద్దరు నేరస్తులను కువైట్ అపరాధ పరిశోధకులు మంగళవారం అరెస్టు చేశారు. ఆ ఘరానా దొంగలు చమురు ఉత్పత్తి చేసే ప్రాంతంలో ఇనుప కంచెని కత్తిరించి లోపలకు దర్జాగా ప్రవేశించి ఆయిల్ బావిలో టిన్నుల కొద్ది పెట్రోల్ అపహరించడమే కాక అక్కడ ఉన్న విద్యుత్ తీగలను సైతం దొంగిలించారు. ఆయిల్ బావులకు కలుపబడిన రెండు ముఖ్యమైన వైర్లను కత్తిరించి చమురు ఉత్పత్తిని నిలిచిపోయేలా చేశారు. ఈ దొంగ సొత్తును అంగారాలో విక్రయించడానికి బేరం పెట్టారు. వీరి కదలికలపై నిఘా పెట్టిన క్రిమినల్ డిటెక్టివ్ లు వారి అనుమానపు తీరుని గమనించి పట్టుకొని నింధుతులిద్దరిని విచారణ చేయగా వారి దొంగతనం వెలుగు చూసింది . ఇద్దరూ తాము చేసిన నేరాన్ని అంగీకరించారువారు 27 కేబుల్స్ ను దొంగిలించి, అగార్సా చెత్త సామాను కొనుగోలు చేసే కేంద్రంలో ఇరానియన్లకు అమ్మివేశారు. ఈ ఇద్దరి దొంగతనంకారణంగా చమురుక్షేత్రంలో మూడు రోజుల పాటు ఆయిల్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఆ నష్టం విలువ 46,000 కువైట్ దినార్ల నష్టంగా అధికారులు అంచనా వేశారు.
తాజా వార్తలు
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు