డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల తీరుపై నిర్మాతల మండలి నిరసన..
- February 01, 2018
డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు అధికంగా వసూలు చేస్తున్న చార్జీలకు వ్యతిరేకంగా నిర్మాతల నుండి తీవ్రవ్యతిరేకత ఎదురవుతోంది. ఇతర రాష్ట్రాల కంటే అత్యధికంగా ఛార్జీలు తీసుకుంటున్న తీరుపై చాలాకాలంగా నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సర్వీస్ ప్రొవైడర్లను కట్టడి చేయాలనే ప్రయత్నాలు తీవ్రంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం అత్యవసర సమావేశం జరిగింది. తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షులు పి.కిరణ్, సెక్రటరీలు ఎమ్.రామదాసు, కె.శివప్రసాదరావు, తెలంగాణ రాష్ట్ర ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు కె.మురళీమోహన్, సెక్రటరీ సునీల్ నారంగ్, దక్షిణాది ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు ఎల్. సురేష్, జాయింట్ సెక్రటరీ రవి కొట్టరాకర, తమిళ సినిమా నిర్మాతల సంఘం అధ్యక్షుడు విశాల్ కృష్ణ, కర్ణాటక ఫిలిం ఛాంబర్ సెక్టరీ ఎన్.ఎమ్. సురేష్, కేరళ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు కె.విజయ్కుమార్, డిస్ట్రీబ్యూషన్ ఛాంబర్ సెక్రటరీ ఎన్.ఎమ్. సురేష్, కేరళ ఫిలిం నిర్మాతల సంఘం అధ్యక్షులు జి.సురేష్కుమార్ ఇంకా మరికొందరు నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు సమావేశమయ్యారు. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాల తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి కార్యాలయంలో అత్యవసర సమావేశమై చర్చించారు. మన సినిమాల ప్రతిఫలం మనకు చెందకుండా డిజిటల్ ప్రొవైడర్లకు చెందడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.
ఎక్కడనుంచో వచ్చిన ప్రొవైడర్లు అన్యాయంగా దోచుకుంటున్నారని ఆవేదన చెందారు. ప్రొవైడర్లు ఈస్ట్ ఇండియా కంపెనీలా తయారయ్యారని, అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని సమావేశమైన అందరూ ఆరోపించారు. తక్కువ ధరకు వస్తున్న డిజిటల్ ప్రొవైడర్లను రాకుండా అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిజిటల్ ప్రొవైడర్లతో ఒకవారంలోగా సమావేశం ఏర్పాటుచేసి వెంటనే ధరలు తగ్గించేలా చర్చించాలని సమావేశం నిర్ణయం తీసు కంది.
వారంలోగా సమస్యకు పరిష్కారం లభించని పక్షంలో మార్చి ఒకటవ తేదీ నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని థియేటర్లను మూసివేయా లని సమావేశంలో నిర్ణయం తీసుకున్నా మని తెలుగు చలనచిత్ర పరిశ్రమ వాణిజ్య మండలి అధ్యక్ష కార్యదర్శులు పి.కిరణ్, ఎం.రాందాస్, కె.శివప్రసాదరావు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సమావేశంలో ఇంకా డి.సురేష్బాబు, శ్యామ్ ప్రసారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు