గల్ఫ్‌లో ఉద్యోగం...అనుమానంతో భార్యను హతమార్చాడు...

- February 02, 2018 , by Maagulf
గల్ఫ్‌లో ఉద్యోగం...అనుమానంతో భార్యను హతమార్చాడు...

అనుమానంతో భార్యను హతమార్చిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా మండవారి గరువు గ్రామంలో చోటు చేసుకుంది. రాడ్‌తో భార్య తలపై కొట్టి చంపాడు భర్త. అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. వెంకటేశ్వరరావుకు సీతామహాలక్ష్మికి 15 ఏళ్ల క్రితం పెళ్లయింది. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. గల్ఫ్‌లో ఉద్యోగం కోసం వెళ్లిన వెంకటేశ్వరరావు చాలా కాలం అక్కడే ఉండి, ఇటీవలే తిరిగొచ్చాడు. తన భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో రాత్రి నిద్రిస్తున్న భార్య తలపై రాడ్‌తో కొట్టి చంపాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com