ప్రపంచకప్ గెలిచిన భారత్.. చరిత్ర సృష్టించారు!
- February 03, 2018
ప్రపంచకప్ లో యువ ఆటగాళ్లు సంచలనం సృష్టించారు. అండర్ 19 ప్రపంచకప్ లో ప్రత్యర్థి జట్టును మట్టి కరిపించి జయహో భారత్ అంటూ... నినాదాలు చేశారు. ఇప్పటికే మూడుసార్లు ట్రోఫీని గెలచుకున్న టీమిండియా. నాలుగోసారి విజయం సాధించి చరిత్ర సృష్టించారు. న్యూజిలాండ్ వేదికగా అండర్ -19 ప్రపంచకప్ టోర్నీ.. ఫైనల్ మ్యాచ్ భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగుకు దిగిన ఆస్ట్రేలియా 216 పరుగులు చేసి అల్ అవుట్ అయింది. 217 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 2 వికెట్ల నష్టానికి మరో పన్నెడు ఓవర్లు మిగిలి ఉండగానే 220 పరుగులు చేసి విజయాన్నందుకుంది. దీంతో ప్రపంచకప్ ఫైనల్లో నాలుగోసారి గెలిచారు. ఇదిలావుంటే భారత్ ఆటగాడు మన్జోత్ కర్లా సెంచరీ సాధించాడు. మొత్తం 101 బంతుల్లో 100 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. భారత్ విజయంలో కీలక భూమిక పోషించాడు.. టీంఇండియా మాజీ సారధి రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలో యువభారత్ ను ముందుండి నడిపించాడు. ఈ మ్యాచ్ కు ఆటగాళ్లు ఫోన్ మాట్లాడటం, వాడటం పక్కన పెట్టాలని కోచ్ ద్రవిడ్ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇదిలావుంటే 2000లో మొహ్మద్ కైఫ్ సారథ్యంలో తొలిసారి ప్రపంచకప్ను ముద్దాడింది... అనంతరం 2008లో విరాట్ కోహ్లి సారథ్యంలో... 2012లో ఉన్ముక్త్ చంద్ కెప్టెన్సీలో భారత్ మరో రెండుసార్లు ప్రపంచకప్లను అందుకుంది. తాజాగా పృద్వి షా సారథ్యంలో నాల్గవసారీ గెలిచి యువభారత్ చరిత్ర సృష్టించింది అయితే అండర్-19 వరల్డ్ కప్ చరిత్రలో అత్యధికసార్లు ప్రపంచకప్లు గెలిచిన ఘనత భారత్-ఆసీస్లది. కాగా నేటి ఫైనల్ లో విజేతగా నిలిచిన భారత్ నాలుగు సార్లు ప్రపంచకప్ సాధించి మొదటి స్థానంలో నిలిచింది. మరోసారి భారత్ ప్రపంచకప్ గెలవడంతో దేశంలో సంబరాలు అంబరాన్నంటాయి.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి