అనుష్కని ప్రశంసలతో ముంచెత్తిన రజని
- February 03, 2018
అనుష్క ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'భాగమతి'. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. జి. అశోక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో అనుష్క నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. హర్రర్ థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. చిత్రం తొలిరోజున ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.12 కోట్లు వసూలు చేసింది.
ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు అనుష్కపై ప్రశంసల జల్లు కురిపించారు. 'భాగమతి' సినిమా చూసిన తర్వాత తన భార్య ఉపాసనకు నిద్రపట్టలేదని రామ్చరణ్ ఫేస్బుక్ వేదికగా పేర్కొన్నారు. కాగా, అనుష్క తాజాగా ఓ ఛానెల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. 'ఇప్పటి వరకు మీకు అందిన ప్రశంసల్లో ఉత్తమమైనది ఏది?' అని అడిగిన విలేకరి ప్రశ్నకు బదులిచ్చారు.
''రజనీకాంత్ ఫోన్ చేశారు.
'భాగమతి' సినిమా చాలా నచ్చింది అన్నారు. మనం ఓ సినిమా చేయడం.. సూపర్స్టార్ ఫోన్ చేసి అలా అభినందించడం చాలా ప్రత్యేకంగా అనిపించింది. నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి, నా స్నేహితులు కూడా శుభాకాంక్షలు చెబుతూ సందేశాలు పంపారు'' అంటూ ఆనందం వ్యక్తంచేశారు.
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు