యు.ఏ.ఈ లోని అజ్మాన్ లో అంగరంగ వైభవంగా 'శ్రీ వెంకటేశ్వరస్వామి కళ్యాణం'

- February 03, 2018 , by Maagulf

యు.ఏ.ఈ:కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. అజ్మాన్లోని ఇండియన్‌ అసోసియేషన్‌ హాల్‌ ఈ ఉత్సవానికి వేదికయ్యింది. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సుమారు 14 వేల మందితో ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఓం నమో వెంకటేశాయ నినాదాలతో మార్మోగిపోయింది. ఈ సంవత్సరం కల్యాణంతో పాటు పుష్ప యాగం కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా కల్చరల్‌ ప్రోగ్రామ్స్‌ని ఏర్పాటు చేశారు. ఇండియన్‌ క్లాసికల్‌ మ్యూజిక్‌ మరియు నృత్యాలు ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.విదేశాల్లో, ముఖ్యంగా గల్ఫ్‌ దేశాల్లో వెంకటేశ్వరస్వామి కళ్యాణానికి ఇంత పెద్దయెత్తున భక్తులు హాజరవడం, ఇంత అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరగడం గొప్ప విషయం. 'సంప్రదాయం' టీం వారి  ఆధ్వర్యంలో ఈ వేడుక అద్భుతంగా జరిగింది.ఈ కార్యక్రమంలో తిరుపతి నుంచి పరదాల మణి,శశిధర్ బాబు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో APNRT మెంబర్షిప్ డ్రైవ్ కి అనుమతి ఇచ్చిన 'సంప్రదాయం' టీం వారికి APNRT కో-ఆర్డినేటర్స్ ధన్యవాదాలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com