ఇక మెరుపు వేగంతో రెబల్ స్టార్ ప్రభాస్
- February 04, 2018
ఏడాదికి కనీసం నాలుగైదు చిత్రాలతో తెరపైకి వచ్చేవారు నిన్నటి తరం కథానాయకులు. అయితే ఇప్పటి హీరోలకు అది సాధ్యమవడం లేదు. మంచి కథ, దాన్ని తెరకెక్కించే సాంకేతిక నిపుణులు, పూర్వ నిర్మాణ కార్యక్రమాలతోనే ఏడాది గడిచిపోతోంది. దీంతో వేగంగా సినిమాలు చేయడం ఇప్పటి స్టార్లకు కుదరడం లేదు. అప్పటిలా కేవలం సాంఘిక చిత్రాలు తగ్గిపోవడం, కొత్తగా ఏవైనా కథలు ప్రయత్నించడం ఇప్పటి చిత్రాల రూపకల్పనకు ఎక్కువ సమయాన్నే తీసుకుంటున్నాయి. వీళ్లలో యంగ్ రెబల్స్టార్ ప్రభాస్ కూడా ఉంటారు. ఆయన చేసేది మంచి ప్రయత్నమే అయినా..కాలహరణమే ఇబ్బంది పెడుతోంది. ఐదేళ్ల బాహుబలి రెండు భాగాల తర్వాత సాహోకు రెండేళ్లు తీసుకుంటున్నారు. అభిమాన కథానాయకుడిని ఏడాదిలో ఒకసారైనా తెరపై చూసుకోవాలనుకునే వాళ్లకు ఇది కష్టమవుతోంది. గొప్ప సినిమా కోసం సర్దుకుపోవాలి అనుకునే అభిమానులూ ఉన్నారు. ఏమైనా తన సినిమాలకు సుదీర్ఘ కాలం పట్టడం ప్రభాస్ కూడా అంతగా ఇష్టపడటం లేదు. ప్రస్తుతం సాహో చిత్రంలో నటిస్తున్న ఈ స్టార్..తన తదుపరి చిత్రం రాధాకృష్ణ దర్శకత్వంలో చేయబోతున్నారు. ఈ సినిమా యూవీ క్రియేషన్స్లోనే ఉండబోతోంది.
ఈ మరుసటి చిత్రాన్ని మాత్రం అత్యంత వేగంగా పూర్తి చేయాలన్నది ప్రభాస్ ఆలోచన. కేవలం నెలల సమయంలోనే సినిమా తెరకెక్కించి..తెరపైకి తీసుకురావాలని ఆయన సన్నాహాలు చేసుకుంటున్నారు.
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు