అగ్ని-1 మిస్సైల్ను పరీక్షించిన ఆర్మీ
- February 06, 2018
బాలసోర్: అణ్వాయుధ సామర్థ్యం కలిగిన అగ్ని-1 బాలిస్టిక్ క్షిపణిని ఇవాళ విజయవంతంగా పరీక్షించారు. ఒడిశా తీరంలోని బాలసోర్లో ఉన్న అబ్దుల్ కలామ్ దీవి నుంచి దీన్ని ప్రయోగించారు. భారతీయ ఆర్మీకి చెందిన స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ దీన్ని పరీక్షించింది. మిస్సైల్ సుమారు 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ను చేధించగలదు. అగ్ని-1లో ఇది 18వ వర్షెన్ కావడం విశేషం. నిర్ణీత సమయంలోనే క్షిపణి టార్గెట్ను చేధించినట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. ఈ మిస్సైల్ను 2004లో సర్వీసులోకి తీసుకువచ్చారు. సైనిక దళాలు తమ రెగ్యులర్ శిక్షణ విన్యాసాల సందర్భంగా ఈ మిస్సైల్ను పరీక్షించారు. అతి తక్కువ సమయంలోనే ఈ మిస్సైల్ను ప్రయోగించే అవకాశాలు ఉన్నట్లు ఆర్మీ వెల్లడించింది. లక్ష్యాన్ని అత్యంత పకడ్బందీగా చేరుకునే ప్రత్యేక నావిగేషన్ వ్యవస్థ అగ్ని-1 మిస్సైల్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. రేంజ్, ఆక్యురెసీలో అగ్ని -1 అత్యుద్భత ప్రదర్శన జరిపినట్లు అధికారులు చెప్పారు. 15 మీటర్లు పొడవు ఉండే అగ్ని-1 సుమారు 12 టన్నుల బరువు ఉంటుంది. ఇది సుమారు వెయ్యి కిలోల పేలోడును మోసుకు వెళ్లగలదు.
ఇదే బేస్ నుంచి గతంలో అగ్ని-1 మిస్సైల్ను 2016 నవంబర్ 22వ తేదీన ప్రయోగించారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి