విజయవాడ చేరుకున్న చంద్రబాబు
- February 08, 2018
అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దుబాయ్ పర్యటన ముగించుకుని శుక్రవారం ఉదయం విజయవాడకు చేరుకున్నారు. ఆయన నిన్న దుబాయ్ వెళ్లారు. కాగా... విభజన హామీలను అమలు చేయాలని కోరుతూ టీడీపీ ఎంపీలు పార్లమెంటులో ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే... దుబాయ్లో ఉన్న చంద్రబాబు అక్కడినుంచి ఢిల్లీలో ఉన్న ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్ధేశం చేశారు. కాగా... ప్రస్తుతం విజయవాడకు చేరుకున్న చంద్రబాబు ఈరోజు కూడా ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. విభజన హామీలపై రెండు రోజులుగా అరుణ్ జైట్లీ చేసిన ప్రకటనలు ఏమాత్రం మేలు చేసేలా లేకపోవడంతో పార్టీ సీనియర్లతో చంద్రబాబు సమావేశం నిర్వహించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు
- 8వ వేతన సంఘం అప్డేట్..
- గల్ఫ్ ఎయిర్ టేకాఫ్ సేల్..తక్కవ ధరలకే 150,000 టిక్కెట్లు..!!
- సులైబిఖాట్ బీచ్లో ఫోటోగ్రాఫర్లపై ఆంక్షలు..!!
- ట్రావెల్ అండ్ టూరిజం సంస్థకు OMR15,815 ఫైన్..!!
- అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు..మార్చిలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా?
- డిజిటల్ ఆడిటర్ కార్డును ప్రారంభించిన ఖతార్..!!
- 'చెక్ యువర్ హెల్త్' క్యాంపెయిన్..నిమిషాల్లో 10 పరీక్షలు..!!
- భారత్కు ట్రంప్ షాక్..









