వర్షా కాలంలో వాహన చోదకులు అప్రమత్తంగా ఉండాలి: కతార్ ఆంతరంగిక మంత్రిత్వ శాఖ
- November 25, 2015
కతార్ వాతావరణ శాఖ వారి అంచనాలప్రకారం, దేశంలో అవరించిఉన్న అల్పపీడనం వలన దోహాతో సహా దేశం లోని అనేక ప్రాంతాలలో నిన్నటి నుండి కురుస్తున్న వర్షాలు, ఈరోజు రేపు కూడా కొనసాగనున్నాయి. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా డ్రైవింగ్ చేసేప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆంతరంగిక మంత్రిత్వ శాఖ అధికారులు అన్నారు. వర్షం వలన రోడ్లు జారుగా మారతాయని, అందువల్ల వాహనంపై నియంత్రణ కోల్పోవచ్చని; నీరునిండిన రోడ్లపై మార్గం ఎంతలోతులో ఉందొ తెలియనందున వేగం తగ్గించి నడపాలని; సడన్ బ్రేక్ లను వేయటం వలన వాహనం పక్కకు జారిపోయే ప్రమాదముండడం వలన జాగ్రత్త వహించాలని; అంతేకాకుండా బయలుదేరేముందు వాహనం యొక్క చక్రాలు, విండ్ షీల్డ్ వైపర్స్ వంటి వాటిని సరి చూసుకోవాలని; హాజర్డ్ లైట్లను వర్షం పడుతున్నపుడు ఉపయోగించకుడా, కేవలం ప్రమాదం ఏదైనా జరిగినపుడు,అత్యవసర పరిస్థితులలో మాత్రమే ఉపయోగించాలని వారు తెలియజేసారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







