వర్షా కాలంలో వాహన చోదకులు అప్రమత్తంగా ఉండాలి: కతార్ ఆంతరంగిక మంత్రిత్వ శాఖ
- November 25, 2015
కతార్ వాతావరణ శాఖ వారి అంచనాలప్రకారం, దేశంలో అవరించిఉన్న అల్పపీడనం వలన దోహాతో సహా దేశం లోని అనేక ప్రాంతాలలో నిన్నటి నుండి కురుస్తున్న వర్షాలు, ఈరోజు రేపు కూడా కొనసాగనున్నాయి. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా డ్రైవింగ్ చేసేప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆంతరంగిక మంత్రిత్వ శాఖ అధికారులు అన్నారు. వర్షం వలన రోడ్లు జారుగా మారతాయని, అందువల్ల వాహనంపై నియంత్రణ కోల్పోవచ్చని; నీరునిండిన రోడ్లపై మార్గం ఎంతలోతులో ఉందొ తెలియనందున వేగం తగ్గించి నడపాలని; సడన్ బ్రేక్ లను వేయటం వలన వాహనం పక్కకు జారిపోయే ప్రమాదముండడం వలన జాగ్రత్త వహించాలని; అంతేకాకుండా బయలుదేరేముందు వాహనం యొక్క చక్రాలు, విండ్ షీల్డ్ వైపర్స్ వంటి వాటిని సరి చూసుకోవాలని; హాజర్డ్ లైట్లను వర్షం పడుతున్నపుడు ఉపయోగించకుడా, కేవలం ప్రమాదం ఏదైనా జరిగినపుడు,అత్యవసర పరిస్థితులలో మాత్రమే ఉపయోగించాలని వారు తెలియజేసారు.
తాజా వార్తలు
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?







