ఇకపై అంబులెన్స్ సేవలకు డబ్బులు చెల్లించాలని దుబాయ్ ప్రకటన

- February 09, 2018 , by Maagulf
ఇకపై అంబులెన్స్ సేవలకు డబ్బులు చెల్లించాలని దుబాయ్ ప్రకటన

దుబాయ్: ఆపదలో ఉన్నామని లబ లబ లాడుతూ అంబులెన్స్ సేవల కోసం ఫోన్ చేస్తే, ప్రాణాలు రక్షించే  ఆ అత్యవసర వాహనాలు 'కుయ్ ..కుయ్ 'మని శబ్దంతో కాకుండా ' ధిర్హాం .. ధిర్హాం ' అంటూ దుబాయిలో ఇకపై ప్రజల వద్దకు పరుగులు పెట్టనున్నాయి. అంబులెన్స్ సర్వీసెస్ కోసం దుబాయ్ కార్పొరేషన్ (డిసిఏఎస్) స్వీయ నిధుల సేకరణ  కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ప్రాథమిక కార్యాచరణ ప్రారంభమయ్యే ఖర్చులను 600 ధిర్హాంలు వసూలు చేయనుంది. అలాగే అత్యవసర పరిస్థితుల్లో1,200 ధిర్హాంలు తీసుకోవచ్చని దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ దుబాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఛైర్మన్ అల్ మక్తూమ్ ఈ చట్టానికి అనుమతిని ఇచ్చారు. శారీరక గాయాలు  లేదా మరణం సంభవిస్తే  ట్రాఫిక్ సంఘటనలకు 6,770 దిర్హాముల పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. డిక్రీ వివరాల ప్రకారం వ్యక్తిని బదిలీ చేయకుండా గాయపడిన క ప్రదేశంలో చికిత్స జరిపితే, 800 దిర్హాముల ఖర్చు అవుతుంది. ఒకవేళ సమీపంలోని ఆసుపత్రికి బదిలీ చేయదలిచితే, మొదటి స్థాయి  మరియు రెండవ స్థాయి అంబులరేటరీ సేవలకు 1, 000 నుండి 1,200 ధిర్హాంల మధ్య ఖర్చు అవుతుంది. ఆసుపత్రి సేవలను గ్రహీత యొక్క బీమా సంస్థ చెల్లిస్తుంది. ఈ డిక్రీకి రెండింటికి సంబంధించిన పట్టిక ప్రకారం, ప్రభుత్వేతర సంస్థలకు సన్నాహక అత్యవసర శిక్షణ మరియు తరలింపు సేవలను రుసుము  400 ధిర్హాం నుంచి 2,150 ధిర్హాంల మధ్య నిర్దేశిస్తుంది. ఇందులో వాహన సహాయం  సైతం ఉంధీ. అవసరమయ్యే అగ్నిమాపక రంగాలు ఉన్నాయి. దుర్ఘటన వల్ల ప్రమాదాలు సంభవించినట్లయితే అత్యవసర అంబులెన్స్ రుసుము వసూలు చేయరు. ఇది 2016 సంవత్సరానికి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ రెజల్యూషన్ నంబర్ -2 లో పేర్కొన్న రుసుము విధానానికి అనుగుణంగా ఉంటుంది. ఇది దుబాయ్ పోలీసులకు, దుబాయ్ అంబులటరీ సేవలకు 6,770 రూపాయలు వసూలు చేయటానికి అనుమతిస్తుంది. ట్రాఫిక్ ప్రమాదాలుజరిగిన తరువాత వ్యక్తుల  శారీరక గాయాలు  లేదా మరణం ద్వారా  ప్రభావితమయ్యే ప్రతి వ్యక్తికి ఆ మొత్తం నుండి బదిలీ చేయటానికి ఇది  భీమాదారుడికి వచ్చే పరిహారంగా పేర్కొంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com