ఓ మహిళ..ఆమె కుమారుడిపై లైంగికదాడికి పాల్పడిన నలుగురు పాకిస్తానీ నిందితులకు శిరచ్చేదనం
- February 09, 2018సౌదీఅరేబియా: ' కంటికి కన్ను ..పంటికి పన్ను ' అనే రీతిలో న్యాయం ఆ దేశాలలో ఖచ్చితంగా అమలవుతుంది కనుక ఏమైనా దారుణాలకు పాల్పడాలంటే నేరస్థులు గజ గజ వణికిపోతారు. ఎంతటి అకృత్యమైన కాసులు వెదజల్లి సులువుగా తప్పించుకోవడం అలవాటైపోయిన దేశాల నుండి గల్ఫ్ దేశాలకు వలస వచ్చిన కొందరు తమ తమ వికృత నైజాలను చూపి ఆ తదుపరి ఆ దేశంలో అమలయ్యే శిక్షలకు బలైపోతుంటారు. ఓ మహిళ .ఆమె కుమారుడిపై లైంగికదాడికి పాల్పడిన గురువారం నలుగురు పాకిస్తానీ నిందితులకు అధికారులు శిరచ్చేదనం ద్వారా మరణశిక్ష అమలు చేశారు. ఆ నేరస్థులు ఒక మహిళపై అత్యాచారం చేసి చంపేశారు. ఆమె కొడుకుపై సైతం అసహజ రీతిలో లైంగికదాడికి పాల్పడ్డారని పోలీసులు చెప్పారు. ఇంట్లో చొరబడి మహిళను బంధించి ముందుగా విలువైన వస్తువులను అపహరించినట్లు పోలీసులు చెప్పారు. తర్వాత ఆమెపై నలుగురు లైంగికదాడి చేశారన్నారు. చివరికి ఆమె కొడుకుపై కూడా లైంగికదాడి చేసినట్లు ఆధారాలు దొరికాయని వారు తెలిపారు. చనిపోయిన మహిళ కొడుకు ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ చేసినట్లు పోలీసులు చెప్పారు. ఆ నేరస్థులను సీసీ కెమెరా ఫుటేజీ సాయంతో పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. వారిని న్యాయస్థానం ఎదుట హజరుపరచగా .కోర్టు వారికి భూమిపై జీవించే హక్కు లేదని తీర్పు ఇచ్చింది. 2018 లో కనీసం రెండు నెలలు పూర్తికాక ముందే ఇప్పటివరకు మొత్తం 20 మందికి సౌదీ న్యాయస్థానం మరణశిక్ష విధించినట్లు అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ