దుబాయ్ లో భారత త్రివర్ణ పతాక సందడి
- February 10, 2018



దుబాయ్: ప్రధానమంత్రి నరేంద్రమోడీ శనివారం సాయంత్రం అబుదాబి చేరుకోనుండగా, ఆయనకు ప్రెసిడెన్షియల్ ప్యాలెస్లో అబుదాబి యువరాజు షేక్ మహమ్మద్ బిన్ జయీద్ అల్ నెహ్యాన్ ఘనంగా స్వాగతం పలకనున్నట్లు యుఎఇ భారత రాయబారి తెలిపారు. ఇరు దేశాల నేతలు పలు ద్వైపాక్షిక అంశాల గురించి చర్చించనున్నట్లు పేర్కొన్నారు. ఆదివారం దుబాయ్లో నిర్వహిస్తున్న ప్రపంచ ప్రభుత్వ సమ్మిట్కు యుఎఇ నేతలతో కలిసి మోడీ హాజరై ప్రసంగించనున్నట్లు తెలిపారు. ఈ సదస్సులో భారత్ ఆతిథ్య దేశంగా పాల్గొననుండగా దుబాయ్లోని ప్రఖ్యాత ప్రాంతాలన్నీ భారతీయ జెండా రంగులతో దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవంతి బుర్జ్ ఖలీఫా, అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెని, ప్రపంచంలోనే అత్యంత పొడవైన పిక్చర్ ఫ్రేమ్ 'దుబారు ఫ్రేమ్'లు భారతీయ జెండా రంగులతో వెలిగిపోతూ కనువిందు చేస్తున్నాయని, ఈ ఫొటోలను యుఎఇ భారత రాయబారి ట్విటర్ ద్వారా పోస్టు చేశారు.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







