దుబాయ్ లో భారత త్రివర్ణ పతాక సందడి
- February 10, 2018



దుబాయ్: ప్రధానమంత్రి నరేంద్రమోడీ శనివారం సాయంత్రం అబుదాబి చేరుకోనుండగా, ఆయనకు ప్రెసిడెన్షియల్ ప్యాలెస్లో అబుదాబి యువరాజు షేక్ మహమ్మద్ బిన్ జయీద్ అల్ నెహ్యాన్ ఘనంగా స్వాగతం పలకనున్నట్లు యుఎఇ భారత రాయబారి తెలిపారు. ఇరు దేశాల నేతలు పలు ద్వైపాక్షిక అంశాల గురించి చర్చించనున్నట్లు పేర్కొన్నారు. ఆదివారం దుబాయ్లో నిర్వహిస్తున్న ప్రపంచ ప్రభుత్వ సమ్మిట్కు యుఎఇ నేతలతో కలిసి మోడీ హాజరై ప్రసంగించనున్నట్లు తెలిపారు. ఈ సదస్సులో భారత్ ఆతిథ్య దేశంగా పాల్గొననుండగా దుబాయ్లోని ప్రఖ్యాత ప్రాంతాలన్నీ భారతీయ జెండా రంగులతో దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవంతి బుర్జ్ ఖలీఫా, అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెని, ప్రపంచంలోనే అత్యంత పొడవైన పిక్చర్ ఫ్రేమ్ 'దుబారు ఫ్రేమ్'లు భారతీయ జెండా రంగులతో వెలిగిపోతూ కనువిందు చేస్తున్నాయని, ఈ ఫొటోలను యుఎఇ భారత రాయబారి ట్విటర్ ద్వారా పోస్టు చేశారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







