పెళ్లికోసం కల్యాణ మండపాన్ని బుక్ చేసుకున్న విశాల్!
- February 10, 2018
తెలుగులో పుట్టి తమిళ సినీ పరిశ్రమలో రాణిస్తున్న పందెంకోడి విశాల్ రెడ్డి, త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించాడు. అయితే పెళ్లి త్వరలో అంటే రెండు మూడు నెలలు , వారాలు కాదు ఏకంగా జనవరిలో. అంటే ఇంకా ఇంచుమించు సంవత్సర కాలం ఉంది. విశాల్ శుక్రవారం విలేకరులతో మాట్లాడారు ఈ సందర్బంగా తన పెళ్లిపై స్పందించారు. నటీనటుల సంఘం నూతన భవన నిర్మాణం వేగంగా జరుగుతోందని, డిసెంబర్ నాటికి పూర్తి అవుతుందని, జనవరిలో ప్రారంభోత్సవం ఉంటుందని తెలిపాడు. సంఘం సొంత భవనంలో జరగనున్నమొదటి వివాహం తనదే అవుతుందని, అందుకే మండపాన్ని అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నానని అన్నారు. కానీ పెళ్లి కూతురు ఎవరనేది మాత్రం విశాల్ చెప్పకపోవడం గమనార్హం. ఇదిలావుంటే గతంలో నటుడు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి, విశాల్ పై మనసుపారేసుకున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి