భారత్లో ఛాంపియన్స్ ట్రోఫీ-2021
- February 10, 2018
దుబాయ్: ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ సిద్ధమైంది. కానీ, ఇందుకు కొన్ని అడ్డంకులు ఉన్నాయి. ముఖ్యంగా పన్ను మినహాయింపు. 2021లో భారత్లో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించాలంటే పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరుతోంది ఐసీసీ.
2016లో టీ20 ప్రపంచకప్నకు భారత్ ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం టోర్నీ నిర్వహణకు పన్ను మినహాయింపు ఇవ్వలేదట. దీంతో ఐసీసీ నిర్వాహకులు 'భారత్లో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించడానికి మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. కాకపోతే మాకు పన్ను మినహాయింపు కావాలి అని కోరుతున్నారట. ఎందుకంటే మాకు టోర్నీ నిర్వహించడానికి చాలా పెద్ద మొత్తంలో ఖర్చవుతుంది. ఇలాంటి సమయంలో పన్ను మినహాయింపు మాకు కాస్త ఊరట ఇచ్చే అంశం' అని తెలిపారు.
దీనిపై ఇప్పటికే బీసీసీఐ కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. క్రీడలను జీవితంలో భాగం చేసుకోమని పిలుపునిచ్చిన ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి మరి.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి