అమరవీరుల యుద్ధ స్మారకం వద్ద మోదీ నివాళి

- February 11, 2018 , by Maagulf
అమరవీరుల యుద్ధ స్మారకం వద్ద మోదీ నివాళి

అబుదాబి : ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. ఆదివారం ఉదయం అబుదాబిలోని యూఏఈ అమరవీరుల యుద్ధ స్మారకం వద్ద ప్రధాని నరేంద్ర మోదీ పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. మరికాసేపట్లు ప్రధాని మోదీ.. అబుదాబిలో తొలి హిందూ దేవాలయానికి భూమి పూజ, శంకుస్థాపన చేయనున్నారు. దుబాయ్‌లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. ఇక భారత్ - యూఏఈ మధ్య 5 కీలక ఒప్పందాలు కుదిరాయి. ఇంధన రంగం, రైల్వేలు, మానవ వనరులు, ఆర్థిక సేవలకు సంబంధించిన ఒప్పందాలపై ఇరు దేశాల అధికారులు సంతకాలు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com