దుబాయ్ ఓపెరా లో ప్రవాస భారతీయుల్ని ఉద్దేశించి ప్రసంగించిన మోడీ
- February 11, 2018
దుబాయ్:భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మూడు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ఆదివారం ఆయన దుబాయ్కు చేరుకున్నారు. ముందు ఆయన అరబ్ దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికులకు నివాళులర్పించారు. ఓపెరా హౌస్కు చేరుకున్న అనంతరం ప్రవాస భారతీయుల్ని ఉద్దేశించి మోడీ ప్రసంగించారు. అరబ్, భారత్కు మధ్య ఉన్న సంబంధం వ్యాపార సంబంధం కాదని, ఇదొక భాగస్వామ్యమని పేర్కొన్నారు. భారత్ నుండి వచ్చి గల్ఫ్లో స్థిరపడిన 30 లక్షల మందికి తమ మాతృభూమి వాతావరణాన్ని కల్పించారని, దీనికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని పేర్కొన్నారు. ప్రపంచంలోనే భారత్ తన ఖ్యాతిని ఇనుమడింపజేస్తోందన్నారు. ఈ దేవాలయాన్ని నిర్మిస్తున్నందుకు 125 కోట్ల భారత ప్రజల తరఫున తాను క్రౌన్ ప్రిన్స్కు కృతజ్ఞతలు తెలుపుతున్నాని, దీని నిర్మాణంతో ప్రపంచ ప్రజలకు వసుదైక కుటుంబం అనే సందేశాన్నిచ్చినట్లవుతుందని పేర్కొన్నారు.
ప్రపంచ బ్యాంకు ఇచ్చే ర్యాంకుల్లో భారత్ 142నుండి 100కు చేరుకుందని, మరింత మెరుగుపడేందుకు కృషిచేస్తామన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!







