దుబాయ్ ఓపెరా లో ప్రవాస భారతీయుల్ని ఉద్దేశించి ప్రసంగించిన మోడీ
- February 11, 2018
దుబాయ్:భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మూడు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ఆదివారం ఆయన దుబాయ్కు చేరుకున్నారు. ముందు ఆయన అరబ్ దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికులకు నివాళులర్పించారు. ఓపెరా హౌస్కు చేరుకున్న అనంతరం ప్రవాస భారతీయుల్ని ఉద్దేశించి మోడీ ప్రసంగించారు. అరబ్, భారత్కు మధ్య ఉన్న సంబంధం వ్యాపార సంబంధం కాదని, ఇదొక భాగస్వామ్యమని పేర్కొన్నారు. భారత్ నుండి వచ్చి గల్ఫ్లో స్థిరపడిన 30 లక్షల మందికి తమ మాతృభూమి వాతావరణాన్ని కల్పించారని, దీనికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని పేర్కొన్నారు. ప్రపంచంలోనే భారత్ తన ఖ్యాతిని ఇనుమడింపజేస్తోందన్నారు. ఈ దేవాలయాన్ని నిర్మిస్తున్నందుకు 125 కోట్ల భారత ప్రజల తరఫున తాను క్రౌన్ ప్రిన్స్కు కృతజ్ఞతలు తెలుపుతున్నాని, దీని నిర్మాణంతో ప్రపంచ ప్రజలకు వసుదైక కుటుంబం అనే సందేశాన్నిచ్చినట్లవుతుందని పేర్కొన్నారు.
ప్రపంచ బ్యాంకు ఇచ్చే ర్యాంకుల్లో భారత్ 142నుండి 100కు చేరుకుందని, మరింత మెరుగుపడేందుకు కృషిచేస్తామన్నారు.
తాజా వార్తలు
- డౌన్టౌన్ దుబాయ్లో పేలుళ్ల వార్తలు అవాస్తవం..
- తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పనితీరుపై సమగ్ర సమీక్ష: డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. నలుగురు మృతి..
- జపాన్ ఓపెన్ లో క్వార్టర్స్కు దూసుకెళ్లిన పీవీ సింధు!
- పూరీ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరు మృతి
- ‘జగన్ 2.0 సూపర్ యాప్’ ఆవిష్కరణ
- అరేబియా టాప్-100 సీఈఓల జాబితాలో 8 మంది కువైటీలు..!!
- నకిలీ ట్రావెల్ ఆఫర్లు, AI స్కామ్లపై యూఏఈ అలెర్ట్..!!
- మత విద్వేష వ్యాఖ్యలు.. మహిళకు నెల రోజుల జైలు శిక్ష..!!
- బెలారస్లో ఒమన్ రాజవంశ సంపద ప్రదర్శన ప్రారంభం..!!







