ఒమన్ లో మోదీ ఏం చేశారు ?

- February 12, 2018 , by Maagulf
ఒమన్ లో మోదీ ఏం చేశారు ?

ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ సోమవారం ఓల్డ్ మస్కట్ లోని 125 ఏళ్ళ చరిత్ర గల శివాలయాన్ని సందర్శించి పూజలు చేశారు. గుజరాత్ కు చెందిన కొందరు వ్యాపారులు దాదాపు 125 సంవత్సరాల క్రితం ఒమన్ వచ్చినప్పుడు ఈ ఆలయాన్ని నిర్మించారని చెబుతున్నారు.

ఆ తర్వాత 1999 లో ఈ గుడిని పునరుద్ధరించారు. కాగా-మస్కట్ లో మూడు లక్షల టన్నుల భారతీయ ఇసుకరాయితో నిర్మించిన సుల్తాన్ ఖబూస్ గ్రాండ్ మసీదును మోదీ విజిట్ చేశారు. అనంతరం ఇదే పేరిట నిర్మించిన స్టేడియం వద్దకు చేరిన సుమారు 20 వేలమంది ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు." కనీస ప్రభుత్వం "( మినిమం గవర్నమెంట్), " గరిష్ట పాలన " (మాగ్జిమం గవర్నెన్స్) అనే " మంత్రాన్ని " తాము జపిస్తున్నామని, సాధారణ ప్రజల జేవితాలు బాధల్లేకుండా కొనసాగాలన్నదే దీని ఉద్దేశమని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఇండియాలో చేపట్టిన బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును గురించి ఆయన ప్రస్తావించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com