ఒమన్ లో మోదీ ఏం చేశారు ?
- February 12, 2018
ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ సోమవారం ఓల్డ్ మస్కట్ లోని 125 ఏళ్ళ చరిత్ర గల శివాలయాన్ని సందర్శించి పూజలు చేశారు. గుజరాత్ కు చెందిన కొందరు వ్యాపారులు దాదాపు 125 సంవత్సరాల క్రితం ఒమన్ వచ్చినప్పుడు ఈ ఆలయాన్ని నిర్మించారని చెబుతున్నారు.
ఆ తర్వాత 1999 లో ఈ గుడిని పునరుద్ధరించారు. కాగా-మస్కట్ లో మూడు లక్షల టన్నుల భారతీయ ఇసుకరాయితో నిర్మించిన సుల్తాన్ ఖబూస్ గ్రాండ్ మసీదును మోదీ విజిట్ చేశారు. అనంతరం ఇదే పేరిట నిర్మించిన స్టేడియం వద్దకు చేరిన సుమారు 20 వేలమంది ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు." కనీస ప్రభుత్వం "( మినిమం గవర్నమెంట్), " గరిష్ట పాలన " (మాగ్జిమం గవర్నెన్స్) అనే " మంత్రాన్ని " తాము జపిస్తున్నామని, సాధారణ ప్రజల జేవితాలు బాధల్లేకుండా కొనసాగాలన్నదే దీని ఉద్దేశమని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఇండియాలో చేపట్టిన బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును గురించి ఆయన ప్రస్తావించారు.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







