ఒమన్లో టొబాకోపై ట్యాక్స్ పెంపు
- February 12, 2018మస్కట్: ఒమన్లో టొబాకోపై ట్యాక్స్ పెరగనుంది. ఇది రెండింతలు కానున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. 200 శాతం వరకు పెంపు ఉంటుందని, ప్రజారోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తోందని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. రాయల్ హాస్పిటల్ సీనియర్ అధికారి మాట్లాడుతూ, టొబాకో వాడకాన్ని తగ్గించేందుకోసం ముందుగా టొబాకో వల్ల కలిగే అనారోగ్య సమస్యల గురించి ప్రజల్లో చైతన్యం పెంచే కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుందని అన్నారు. అలాగే పొగాకు వాడకంపై నిషేధాజ్ఞలు విధించే దిశగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆ అధికారి తెలిపారు. టొబాకో ఉత్పత్తులపై ట్యాక్స్ పెంచడం మరో మార్గం. ఈ మూడూ ఒకేసారి చేపట్టడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. 2016లో ఒమన్లో టొబాకోపై ట్యాక్స్ని 100 శాతం పెంచింది. జిసిసిలోని మిగతా దేశాలూ ఇదే తరహా చర్యలు తీసుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు