ఒమన్లో టొబాకోపై ట్యాక్స్ పెంపు
- February 12, 2018
మస్కట్: ఒమన్లో టొబాకోపై ట్యాక్స్ పెరగనుంది. ఇది రెండింతలు కానున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. 200 శాతం వరకు పెంపు ఉంటుందని, ప్రజారోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తోందని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. రాయల్ హాస్పిటల్ సీనియర్ అధికారి మాట్లాడుతూ, టొబాకో వాడకాన్ని తగ్గించేందుకోసం ముందుగా టొబాకో వల్ల కలిగే అనారోగ్య సమస్యల గురించి ప్రజల్లో చైతన్యం పెంచే కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుందని అన్నారు. అలాగే పొగాకు వాడకంపై నిషేధాజ్ఞలు విధించే దిశగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆ అధికారి తెలిపారు. టొబాకో ఉత్పత్తులపై ట్యాక్స్ పెంచడం మరో మార్గం. ఈ మూడూ ఒకేసారి చేపట్టడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. 2016లో ఒమన్లో టొబాకోపై ట్యాక్స్ని 100 శాతం పెంచింది. జిసిసిలోని మిగతా దేశాలూ ఇదే తరహా చర్యలు తీసుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత







