ఉల్లంఘన: 562,961 మంది వలసదారుల అరెస్ట్
- February 13, 2018
రియాద్: మొత్తం 562,691 మంది వలసదారుల్ని గత ఏడాది నవంబర్ 1 నుంచి ఇప్పటిదాకా అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. సౌదీ లేబర్ మరియు రెసిడెన్సీ అలాగే బోర్డర్ సెక్యూరిటీ చట్టాల్ని ఉల్లంఘించినందుకుగాను వీరిని అరెస్ట్ చేశారు. 'ఎ నేషన్ వితౌట్ వయొలేటర్స్' నినాదంతో దేశవ్యాప్తంగా చేపట్టిన క్యాంపెయిన్లో ఉల్లంఘనుల్ని గుర్తించి, అరెస్ట్ చేశారు. ఇందులో 382,921 మంది వద్ద చెల్లుబాటయ్యే రెసిడెన్సీ పర్మిట్ లేదు. 127,566 మంది వద్ద సరైన వర్క్ పర్మిట్ లేదు. 62,204 మంది బోర్డర్ సెక్యూరిటీ సిస్టమ్కి సంబంధించిన ఉల్లంఘనలకు పాల్పడ్డారు. అక్రమంగా సౌదీలోకి ప్రవేశించేందుకు యత్నించిన 7,996 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో 69 శాతం యెమనీయులు ఉండగా, 29 మంది ఇథియోపియన్స్ ఉన్నారు. 2 శాతం మంది ఇతర దేశాలకు చెందినవారున్నారు. కింగ్డమ్ నుంచి పారిపోయేందుకు యత్నించిన 501 మందిని అరెస్ట్ చేశారు. అక్రమంగా దేశంలో నివసిస్తున్నవారే అనేకరకాలైన నేరాలకు పాల్పడుతున్నట్లు రియాద్ పోలీసు అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి