నేపాల్ ప్రధానిగా రెండోసారి ఆయనే..భారత్కు ఇబ్బందే
- February 15, 2018
కఠ్మాండు: నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా గురువారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో సీపీఎన్-యూఎంఎల్ ఛైర్ పర్సన్ ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలి రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన రెండు నెలల తర్వాత ఓలి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమమైంది. ఆ దేశ అధ్యక్షురాలు బిద్యా దేవి భండారి 65ఏళ్ల ఓలిని నేపాల్ 41వ ప్రధానిగా నియమించారు. చైనాకు అనుకూలంగా వ్యవహరించే ఓలి గతంలో అక్టోబరు 2015 నుంచి ఆగస్టు 2016 వరకు ప్రధానిగా పనిచేశారు. ప్రధాని అభ్యర్థిత్వానికి ప్రధాన పార్టీలు యూసీపీఎన్-మావోయిస్ట్, రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ(నేపాల్), మాధేశీ రైట్స్ ఫోరమ్-డెమోక్రటిక్తో పాటు 13 చిన్న పార్టీలు మద్దతు తెలిపాయి. అంతకుముందు షేర్ బహదూర్ జాతినుద్దేశిస్తూ కీలక ప్రసంగం చేసి తన రాజీనామాను బిద్యా దేవికి సమర్పించారు. పొరుగు దేశం చైనాకు అనుకూలంగా ఉండే ఓలితో సరిహద్దు దేశం భారత్కు కొంచెం ఇబ్బందికరమైన విషయమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. భారత్-భూటాన్-టిబెట్(చైనా) సరిహద్దు ప్రాంతం డోక్లాంలో చైనా సైనికులను మోహరించి భారత్ను దెబ్బకొట్టేందుకు డ్రాగన్ వ్యూహాలు పన్నిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







