రేపు హైదరాబాద్‌కు ఇరాన్ అధ్యక్షుడు హసన్ రోహనీ

- February 15, 2018 , by Maagulf
రేపు హైదరాబాద్‌కు ఇరాన్ అధ్యక్షుడు హసన్ రోహనీ

హైదరాబాద్: ఇరాన్ అధ్యక్షుడు హసన్ రోహనీ .. హైదరాబాద్‌కు వస్తున్నారు. ఆయన రేపు చార్మినార్ వద్ద ఉన్న మక్కా మసీదులో శుక్రవారం ప్రార్థనల్లో పాల్గొంటారు. ఇరాన్ అధ్యక్షుడు రోహనీ.. నగరంలోని గోల్కొండ‌ కోటతో పాటు సాలార్ జంగ్ మ్యూజియంలను కూడా సందర్శిస్తారు. మ‌సీదులో ప్రార్థ‌న‌ల అనంత‌రం ఆయ‌న మ‌త పెద్ద‌ల‌తో స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు. రోహ‌నీ రాక సంద‌ర్భంగా ఇరానియ‌న్ ఆయిల్ కంపెనీతో భార‌తీయ అధికారులు ప్ర‌త్యేక స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు. మూడు రోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆయ‌న ఇవాళ భార‌త్‌కు చేరుకోనున్నారు. ఈనెల 17వ తేదీన ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో రోహ‌నీకి స్వాగ‌తం తెలుపనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com