రేపు హైదరాబాద్కు ఇరాన్ అధ్యక్షుడు హసన్ రోహనీ
- February 15, 2018
హైదరాబాద్: ఇరాన్ అధ్యక్షుడు హసన్ రోహనీ .. హైదరాబాద్కు వస్తున్నారు. ఆయన రేపు చార్మినార్ వద్ద ఉన్న మక్కా మసీదులో శుక్రవారం ప్రార్థనల్లో పాల్గొంటారు. ఇరాన్ అధ్యక్షుడు రోహనీ.. నగరంలోని గోల్కొండ కోటతో పాటు సాలార్ జంగ్ మ్యూజియంలను కూడా సందర్శిస్తారు. మసీదులో ప్రార్థనల అనంతరం ఆయన మత పెద్దలతో సమావేశం నిర్వహించనున్నారు. రోహనీ రాక సందర్భంగా ఇరానియన్ ఆయిల్ కంపెనీతో భారతీయ అధికారులు ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన ఇవాళ భారత్కు చేరుకోనున్నారు. ఈనెల 17వ తేదీన ప్రభుత్వ లాంఛనాలతో రోహనీకి స్వాగతం తెలుపనున్నారు.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు







