రేపు హైదరాబాద్కు ఇరాన్ అధ్యక్షుడు హసన్ రోహనీ
- February 15, 2018
హైదరాబాద్: ఇరాన్ అధ్యక్షుడు హసన్ రోహనీ .. హైదరాబాద్కు వస్తున్నారు. ఆయన రేపు చార్మినార్ వద్ద ఉన్న మక్కా మసీదులో శుక్రవారం ప్రార్థనల్లో పాల్గొంటారు. ఇరాన్ అధ్యక్షుడు రోహనీ.. నగరంలోని గోల్కొండ కోటతో పాటు సాలార్ జంగ్ మ్యూజియంలను కూడా సందర్శిస్తారు. మసీదులో ప్రార్థనల అనంతరం ఆయన మత పెద్దలతో సమావేశం నిర్వహించనున్నారు. రోహనీ రాక సందర్భంగా ఇరానియన్ ఆయిల్ కంపెనీతో భారతీయ అధికారులు ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన ఇవాళ భారత్కు చేరుకోనున్నారు. ఈనెల 17వ తేదీన ప్రభుత్వ లాంఛనాలతో రోహనీకి స్వాగతం తెలుపనున్నారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







